త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha kalwakuntla | కేసీఆర్ మార‌తారేమో అనుకున్నా.. కేటీఆర్ కైతే ఏం తెల్వ‌దు: క‌విత కామెంట్స్

Kavitha kalwakuntla | త‌న‌ను పార్టీలో నుంచి బ‌య‌ట‌కు పంపితే వెంట‌నే పార్టీ పెట్ట‌లేద‌ని, వాళ్లు మార‌తారేమోన‌ని ఎదురుచూశాన‌ని క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'కేసీఆర్‌(KCR)కు అధికార‌మే ఎక్కువైందా.. మమకారం తగ్గిపోయిందా? రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నార‌న్నారు.

S

News | Published On Apr 25, 2026, 11.53 am IST

Kavitha kalwakuntla | కేసీఆర్ మార‌తారేమో అనుకున్నా.. కేటీఆర్ కైతే ఏం తెల్వ‌దు: క‌విత కామెంట్స్
Advertisement

Kavitha kalwakuntla | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌ను పార్టీలో నుంచి బ‌య‌ట‌కు పంపితే వెంట‌నే పార్టీ పెట్ట‌లేద‌ని, వాళ్లు మార‌తారేమోన‌ని ఎదురుచూశాన‌ని క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'కేసీఆర్‌(KCR)కు అధికార‌మే ఎక్కువైందా.. మమకారం తగ్గిపోయిందా? రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నార‌న్నారు. కేటీఆర్‌(KTR)కు రాజ‌కీయం తెల్వ‌ద‌న్నారు. మునీరాబాద్ పార్టీ ఆవిర్భావ స‌భ‌లో శ‌నివారం ఆమె ప్ర‌సంగించారు.

అధికారం ఇవ్వ‌క‌పోతే వ‌దిలేస్తారా?

ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అంటున్నారు. మీకు అధికారం ఇవ్వకపోతే ప్ర‌జ‌ల‌ను వదిలేస్తారా? రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తోంది. ప్రజలు అరిగోస పడుతున్న‌రు. నన్ను పార్టీలో నుంచి బయటకు పంపారు. పది నెలలైనా మారలేదు. ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది. ఆనాడు మీకు జరిగింది.. ఇవాళ నాకు జరిగింది.. ఇందులో తేడా ఏమి లేదు' అంటూ కల్వకుంట్ల కవిత మాట్లాడారు.

సామాజిక ర‌థ చ‌క్రం ముక్క‌లైంది..

కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయ‌నుకుంటే రైతులకు బేడీలు వ‌చ్చి పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దాడుల‌కు గుర‌య్యారు. నిఘా నీడలో తెలంగాణ అంతా కాలం వెళ్ల‌దీసింది. ఆనాడు పాలించిన కుటుంబంలో నేనూ భాగమే. అందుకు కొన్ని విష‌యాల్లో సిగ్గుపడుతున్నాను' అని కవిత పేర్కొన్నారు.

మన కేసీఆర్‌ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు. మారిన కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లారు. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి. కానీ ఈరోజు ఆయ‌న ప‌రిణ‌తి కోల్పోయారు. కేటీఆర్‌కు రాజకీయం తెల్వ‌దు. కేసీఆర్ మారుతారేమోనని చూశా. కానీ నన్నే సస్పెండ్‌ చేశారు అని క‌విత వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement