త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rathod Bapurao | తెలంగాణ జాగృతిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే చేరిక‌

Rathod Bapurao | క‌విత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)లో చేరిక‌(Joins)ల ప‌ర్వం షురువైంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు.

S

News | Published On Apr 19, 2026, 3.44 pm IST

Rathod Bapurao | తెలంగాణ జాగృతిలో బోథ్ మాజీ ఎమ్మెల్యే చేరిక‌
Advertisement

Rathod Bapurao: త్రినేత్ర‌.న్యూస్‌: క‌విత (Kavitha) కొత్త పార్టీ ఏర్పాటుకు ముందే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi)లో చేరిక‌(Joins)ల ప‌ర్వం షురువైంది. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైద‌రాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్‌లోని కార్యాల‌యంలో క‌విత స‌మ‌క్షంలో ఆయ‌న జాగృతి కండువా క‌ప్పుకొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత బాపూరావుకు స్వాగ‌తం ప‌లికారు.

క‌విత ముఖ్య‌మంత్రి కావాలి..

ఈ సంద‌ర్భంగా రాథోడ్ బాపూరావు మాట్ల‌డారు. తెలంగాణ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా కవిత కావాలని ఆకాంక్షించారు. కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో పెద్ద సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పార్టీలో చేర్పిస్తాన‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా త‌న‌కు ప్రాధాన్యం దక్కలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులొస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి బోథ్ నియోజకవర్గంలో పని చేశాన‌ని గుర్తు చేశారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశాన‌న్నారు. అనంత‌రం రాజకీయాల్లోకి వచ్చాన‌ని పేర్కొన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని తెలిపారు. మధ్యలో వచ్చిన వాళ్లు మంత్రులు అయ్యార‌ని.. మూడోసారి త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేద‌ని వాపోయారు. ఇక‌ కవిత నాయకత్వంలో కొత్త పార్టీలో చేరబోతున్నాన‌ని ప్ర‌క‌టించారు.

అడ్వ‌కేట్ల చేరిక‌..

తెలంగాణ జాగృతి లీగల్ సెల్ అధ్యక్షులు అప్పల నరేందర్ ఆధ్వర్యంలో పలువురు అడ్వకేట్లు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కండువా కప్పి వారిని జాగృతిలోకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement