త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

First Survey map Registration | కుసుమంచిలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ : మంత్రి పొంగులేటి

First Survey map Registration | ఖమ్మం (Khammam) జిల్లా కుసుమంచి (Kusumanchi)లో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ (First Survey map Registration) జ‌ర‌గ‌డం న‌వ‌శ‌కానికి నాంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ వివాదాల ప‌రిష్కారానికి ఇదొక చ‌క్క‌ని మార్గమ‌ని కొనియాడారు. సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారిస్తేనే రైతుకు భరోసా ఉంటుంద‌న్నారు.

S

News | Published On Apr 21, 2026, 6.48 pm IST

First Survey map Registration | కుసుమంచిలో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ : మంత్రి పొంగులేటి
Advertisement
  • భూ వివాదాల ప‌రిష్కారంలో ఇదొక‌ సువ‌ర్ణాధ్యాయం
  • భూమి హక్కులకు శాశ్వత భరోసా
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్‌: ఖమ్మం (Khammam) జిల్లా కుసుమంచి (Kusumanchi)లో స‌ర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేష‌న్ (First Survey map Registration) జ‌ర‌గ‌డం ఒక సువ‌ర్ణాధ్యాయం అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. భూ వివాదాల ప‌రిష్కారానికి ఇదొక చ‌క్క‌ని మార్గం అన్నారు. రైతు జీవితం భూమితో ముడిప‌డి ఉంద‌ని ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉంటేనే అత‌ని జీవితం భద్రంగా ఉంటుంద‌న్నారు. ఈ హక్కును సర్వే మ్యాప్‌తో, భూధార్ నెంబర్‌తో శాశ్వతంగా నిర్ధారిస్తేనే రైతుకు భరోసా ఉంటుంద‌న్నారు. ఆపై నమ్మ‌కం క‌లుగుతుంద‌ని చెప్పారు.

ఈనెల 2 నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు..

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామ‌న్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ల్యాండ్‌, స‌ర్వే, రిజిస్ట్రేష‌న్ విభాగాల‌ను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి త‌యారు చేసిన‌ భూభార‌తి పోర్ట‌ల్‌ను తీసుకొచ్చామ‌న్నారు. ఈనెల 2 నుంచి నారాయ‌ణ‌పేట జిల్లా కొస్గి, ఖ‌మ్మం జిల్లా కుసుమంచి, భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట‌, రంగారెడ్డి జిల్లా అమన్‌గ‌ల్‌, సంగారెడ్డి జిల్లా వ‌ట్‌ప‌ల్లిలో ప్ర‌యోగాత్మ‌కంగా అమలు చేస్తున్నామ‌ని వివ‌రించారు.

గ‌ట్టు సింగారం రెవెన్యూ గ్రామంలో..

ఖమ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని కుసుమంచి మండలంలో స‌ర్వే మ్యాప్‌తో మంగ‌ళ‌వారం తొలి రిజిస్ట్రేష‌న్ చేసి న‌వ‌శ‌కానికి నాంది ప‌లికామ‌న్నారు. గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలోని స‌ర్వే నెంబ‌ర్ 156/ఇ/1 లోని ఎక‌రా నాలుగు గుంట‌ల భూమిని, నేల‌కొండ‌ప‌ల్లి మండ‌లం ముత్తాపురం గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన క‌ట్టా వెంక‌టేశ్వ‌ర‌రావుకు విక్ర‌యించారు. ఈ సంద‌ర్బంగా త‌న భూమి హ‌ద్దులతో కూడిన‌ మ్యాప్ ను జ‌త చేసి కుసుమంచి త‌హ‌సీల్దార్‌ కార్యాల‌యంలో రిజిస్ట్రేష‌న్ చేశారు. దీనికి సంబంధించి (భూ క‌మ‌త పటము-1, భూధార్ నెంబ‌ర్ 795GCHDCUPJ7H0) ను త‌హ‌సీల్ధార్ కేటాయించారు. స‌ర్వే విష‌యంలో పాత విధానాల‌కు స్వ‌స్తి చెప్పి అధునాత‌న రోవర్ల‌ను వినియోగిస్తూ క‌చ్చిత‌త్వంతో స‌ర్వే పూర్తి చేయిస్తున్నామ‌ని జూప‌ల్లి వివ‌రించారు.

Advertisement
Advertisement