త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kishan Reddy | రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కిషన్‌ రెడ్డి

Kishan Reddy | తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, ఇప్పటికే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ ను పూర్తి చేసుకున్నామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. మోదీ స‌హ‌కారంతో తెలంగాణ అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు.

S

News | Published On May 10, 2026, 5.38 pm IST

Kishan Reddy | రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కిషన్‌ రెడ్డి
Advertisement
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్
  • రూ. 200 కోట్ల‌తో అభివృద్ధి
  • కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి వెల్ల‌డి

Kishan Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసుకుంటున్నామ‌ని, ఇప్పటికే చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ ను పూర్తి చేసుకున్నామ‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ను రూ. 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామ‌ని.. త్వరలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులా మారుతుందని చెప్పారు. హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC) లో ప్ర‌ధాని మోదీ పాల్గొన్న స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. మోదీ స‌హ‌కారంతో తెలంగాణ అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు.

చాలా రోజుల త‌ర్వాత మోదీ తెలంగాణ‌కు వ‌చ్చార‌ని.. ఈ సంద‌ర్భంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి ప‌నులను ప్రారంభించుకున్నామ‌ని పేర్కొన్నారు. వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కు ప్రారంభోత్సవం, జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన‌ట్లు తెలిపారు. మూడేళ్ల క్రితమే ఆర్‌ఆర్‌ఆర్‌ పనులకు కేంద్రం అనుమతించిందన్నారు. త్వరలోనే ఆ పనులు ప్రారంభించుకుంటామ‌ని వివ‌రించారు. 2014 వరకు 2,400 కిలో మీట‌ర్ల హైవేలు ఉంటే ఈ 11 ఏళ్లలో 2,600 కి.మీ. హైవేలు అభివృద్ధి చేసుకున్నామ‌ని పేర్కొన్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి తెలంగాణ అభివృద్ధికి పాటుప‌డుదాం. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధిలో ఎలాంటి వివ‌క్ష లేకుండా ప‌ని చేస్తున్నాం. మోదీ హ‌యాంలో 2047 విక‌సిత్ భార‌త్‌ను సాకారం చేసుకోవాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు స‌మాంత‌రంగా అభివృద్ధి చెందాలి. రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స‌హాయ‌స‌హ‌కారాల‌తో ప‌ని చేస్తం అని కిష‌న్‌రెడ్డి వెల్ల‌డించారు.

 

Advertisement
Advertisement