త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Compensation announcement | శంక‌ర్‌గౌడ్ కుటుంబానికి ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌.. ఒక‌రికి ఉద్యోగం, రూ.10 ల‌క్ష‌ల సాయం

RTC driver Shankar Goud | ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్(Shankar Goud) కుటుంబానికి ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. వారి కుటుంబానికి ఆర్టీసీ(RTC)లో ఉద్యోగంతో పాటు రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు న‌ర్సంపేట ఆర్డీవో ఉమారాణి(RDO Umarani) శంక‌ర్‌గౌడ్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం ఈ ప‌రిహారం ప్ర‌క‌టించారు.

S

News | Published On Apr 24, 2026, 4.20 pm IST

Compensation announcement | శంక‌ర్‌గౌడ్ కుటుంబానికి ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌.. ఒక‌రికి ఉద్యోగం, రూ.10 ల‌క్ష‌ల సాయం
Advertisement

Compensation announcement | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్(Shankar Goud) కుటుంబానికి ప్ర‌భుత్వం ప‌రిహారం ప్ర‌క‌టించింది. వారి కుటుంబానికి ఆర్టీసీ(RTC)లో ఉద్యోగంతో పాటు రూ.10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు న‌ర్సంపేట ఆర్డీవో ఉమారాణి(RDO Umarani) శంక‌ర్‌గౌడ్ మృత‌దేహానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం ఈ ప‌రిహారం ప్ర‌క‌టించారు. అటు న‌ర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధ‌వ‌రెడ్డి(MLA Madhava Reddy) వ్య‌క్తిగ‌తంగా బాధిత కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల ఆర్థిక సాయం అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

స‌మ్మె నేప‌థ్యంలో న‌ర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవ‌ర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందారు. శుక్ర‌వారం ముత్తోజిపేట‌లో అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌నున్న క్ర‌మంలో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. మ‌రోవైపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్‌ అధికారుల కమిటీ సమావేశమైంది. ఉద్యోగులతో భేటీలో కమిటీ ఛైర్మన్‌ వికాస్‌రాజ్‌, సభ్యులు దానకిశోర్‌, సందీప్‌ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement