Vakiti Srihari | ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలవి అబద్ధాలు.. పాలమూరులో మధ్యలోనే వదిలేశారు
90 శాతం తమ ప్రభుత్వమే ప్రాజెక్టులు పూర్తి చేసిందని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboobnagar) జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు.
- సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి
త్రినేత్ర.న్యూస్: 90 శాతం తమ ప్రభుత్వమే ప్రాజెక్టులు పూర్తి చేసిందని బీఆర్ఎస్ నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వాస్తవానికి క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) విమర్శించారు. హైదరాబాద్ (Hyderabad) లోని ఎర్రమంజిల్ జలసౌధలో రాష్ట్ర సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar reddy) అధ్యక్షతన ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahaboobnagar) జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం మధ్యలోనే వదిలేశారని ఆరోపించారు. మక్తల్ - నారాయణపేట-కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతులకు 99శాతం భూములకు నష్ట పరిహారం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జూరాల ప్రాజెక్టు (Jurala project) లో సిల్ట్ తొలగించకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ పంప్ హౌస్లు పూర్తి చేస్తే...
పాలమూరు–రంగారెడ్డి (Palamuru-Rangareddy) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో భూత్పూర్, సంగనబండ, పంప్ హౌస్లతో పాటు సర్జీపూర్ పంప్ హౌస్ (Pump house) ను కూడా పూర్తి చేయాలని చెప్పారు. సర్జీపూర్ పంప్ హౌస్ పూర్తియితే మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు తక్కువ సమయంలో ఎక్కువ నీటిని సరఫరా చేయవచ్చని వివరించారు. ప్రాజెక్టుల గేట్లు మరమ్మతులు చేయకపోవడం వల్ల నీరు వృథాగా పోతుందని వాపోయారు. నిర్లక్ష్యంగా ఉండటం వల్ల పొలాలకు పారాల్సిన నీరు, వృథా అవుతోందన్నారు. భూత్పూర్, సంగనబండ గ్రామాల ప్రజలు 6 వేలకు పైగా ఎకరాలు భూమి ఇచ్చారని, వారికి పరిహారం ఇవ్వక పోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంగనబండ పంప్ హౌస్ కు సంబంధించి కర్ణాటక రైతులు (Karnataka formers) 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు పరిహారం ఇస్తే సంగనబండ పంప్ హౌస్ ను మరింత సరళతరం చేయవచ్చని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల గేట్ల పర్యవేక్షణ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






