Kavitha | ప్రాజెక్టుల కోసం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసినా.. అన్నదాతలకు అందని సాగు నీరు: కవిత
Kavitha | రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. 12 ఏండ్లలో రెండు పార్టీల ప్రభుత్వాలు రూ.2.20 లక్షల కోట్లు ఖర్చు చేశాయని, అయినప్పటికీ సాగు నీరు అందక అన్నదాతలు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. 12 ఏండ్లలో రెండు పార్టీల ప్రభుత్వాలు రూ.2.20 లక్షల కోట్లు ఖర్చు చేశాయని, అయినప్పటికీ సాగు నీరు అందక అన్నదాతలు అరిగోస పడుతున్నారని విమర్శించారు. ఎండల తీవ్రత పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయన్నారు. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా రైతులు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా కుర్మిద్ద, నానక్ నగర్, మంతన్ గౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని చెప్పారు. ఒక్కో ట్యాంకర్కు రూ.వెయ్యికి పైగా చెల్లిస్తున్నారని, ఇలా వరి, కూరగాయల పంటలను రక్షించుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు. ఒక మహిళా రైతు తన పంట చేతికి రావాలంటే నీళ్ల ట్యాంకర్లకే రూ.1.50 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పడం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల దుబారా పనులకు అద్దం పడుతున్నదని మండిపడ్డారు.
12 ఏళ్లు.. 2.20 లక్షల కోట్ల ఖర్చు.. సాగునీరు అందక అన్నదాతల అరిగోస
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రెండు పార్టీల ప్రభుత్వాలు లక్షలాది కోట్లు ఖర్చు చేసినా రైతులకు సాగు నీరు అందడం లేదు
ఎండల తీవ్రత పెరగడంతో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటున్నాయి
రాష్ట్రవ్యాప్తంగా… pic.twitter.com/52kfo8sQ8T
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 20, 2026
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



