త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oath taking | ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండ‌రాం ప్ర‌మాణ స్వీకారం

Oath taking | శాసన మండలి ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం (Kodandaram) ప్ర‌మాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukendar Reddy) వారితో ప్రమాణ‌స్వీకారం చేయించారు.

S

News | Published On Apr 27, 2026, 12.57 pm IST

Oath taking | ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండ‌రాం ప్ర‌మాణ స్వీకారం
Advertisement

Oath taking | త్రినేత్ర‌.న్యూస్‌: శాసన మండలి ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం (Kodandaram) ప్ర‌మాణ స్వీకారం చేశారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా ఏర్ప‌డిన నిరీక్ష‌ణ‌కు తెర ప‌డిన‌ట్లైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukendar Reddy) వారితో ప్రమాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, ఎంమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు.

 

గవర్నర్‌ కోటాలో కోదండరాం, మహమ్మద్‌ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మైనారిటీల‌కు సీఎం పెద్ద‌పీట‌: అజారుద్దీన్‌

ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించినందుకుఉ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం మరింత కృషి చేసేందుకు అవ‌కాశం ల‌భించింద‌ని చెప్పారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు స‌హ‌జ‌మ‌ని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాల‌న్నారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనే వార్త‌లో వాస్త‌వం లేద‌ని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మొదట్నుంచీ మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నార‌ని పేర్కొన్నారు.

ఇక ముందూ పోరాడ‌తా: కోదండరాం

ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటా. ఇందుకు ప్రజలకు హామీ ఇస్తున్నాను. యూనివర్సిటీల పునరుద్ధరణ, బీసీ రిజర్వేషన్ల సాధన వంటి అనేక అంశాలపై పని చేస్తూనే ఉన్నాం. ఈ ఎమ్మెల్సీ పదవి అందుకు మరింత ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఇంతకాలం పోరాడినట్లే ప్రజల తరఫున ఇకముందూ పోరాడతాం.

 

Advertisement
Advertisement