త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించండి: గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

CM Revanth Reddy | ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గవర్నర్‌ (Governor) శివ ప్రతాప్‌ శుక్లాను లోక్‌భవన్‌లో ఆదివారం కలిశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించారు.

S

News | Published On Apr 19, 2026, 12.16 pm IST

CM Revanth Reddy | ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించండి: గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గవర్నర్‌ (Governor) శివ ప్రతాప్‌ శుక్లాను లోక్‌భవన్‌లో ఆదివారం కలిశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీల(MLC's) పేర్లు ఆమోదించాలని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ప్రొ.కోదండరామ్‌ (Kodandaram), మాజీ క్రికెట‌ర్‌ అజారుద్దీన్‌(Azaharuddin) పేర్లు ఆమోదించాలని కోరారు.

అజారుద్దీన్‌ ఏ సభలో సభ్యుడు కానప్పటికీ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్ర‌ మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. అయితే ఆరు నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండడం త‌ప్ప‌నిస‌రి కాగా ఫైల్ పై సంత‌కం చేయాల‌ని సీఎం రేవంత్ గ‌వ‌ర్న‌ర్ ను కోరారు. ఒక‌వేళ‌ గవర్నర్ సీఎం ప్ర‌తిపాద‌న‌ను ఆమోదించకపోతే ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆలోపే గ‌వ‌ర్న‌ర్ కోటాలో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం ఓ వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల్లోపు అసెంబ్లీ లేదా మండలికి త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పరిపాలనా సౌలభ్యం కోసం, అనుభవజ్ఞులను ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించారు. ఒకవేళ గవర్నర్ కోటా కాకపోతే ఖాళీగా ఉన్న ఏదైనా ఎమ్మెల్సీ స్థానం, స్థానిక సంస్థలు లేదా ఎమ్మెల్యే కోటాలో ఆయన్ని మండ‌లికి పంపాలి. ఇది కూడా ఫ‌లించ‌కుంటే మంత్రి ప‌దవి కోల్పోక త‌ప్ప‌దు.

 

Advertisement
Advertisement