త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Student suicide | గురుకులంలో మరో విద్యార్థి ఆత్మహత్య.. అంత పిరికివాడు కాదంటున్న‌ త‌ల్లి

Student suicide | మహబూబాబాద్ (Mahaboobabad) జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి రావు పూలే కాలేజీ (Mahatma Jyothiba Phule)లో ఓ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఘ‌ట‌నా స్థలానికి కుటుంబ స‌భ్యులు చేరుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి.

S

News | Published On Apr 27, 2026, 3.21 pm IST

Student suicide | గురుకులంలో మరో విద్యార్థి ఆత్మహత్య.. అంత పిరికివాడు కాదంటున్న‌ త‌ల్లి
Advertisement

Student suicide | త్రినేత్ర‌.న్యూస్‌: గురుకుల క‌ళాశాల‌లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న‌ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతి రావు పూలే కాలేజీ (Mahatma Jyothiba Phule) లో చోటుచేసుకుంది. మృతుడిని భూపాల‌పల్లి (Bhupalapally) జిల్లా గోరికొత్త‌ప‌ల్లికి చెందిన ర‌చ‌ర్ల కార్తీక్ (Karthik) (19)గా గుర్తించారు. త‌ల్లిదండ్రులు క‌ళాశాల వ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది.

మృతిపై త‌ల్లిదండ్రుల అనుమానం..

తన కొడుకు చిన్నప్పటి నుండి హాస్టళ్లలోనే చదువుకున్నాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి త‌ల్లి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హాస్టల్లో సీసీటీవీ పనిచేయడం లేదని, తాము వచ్చే సరికే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారని ఆగ్రహించారు. ఈ స‌మ‌యంలో ఆత్మహత్య అని ఎలా నిర్ధారణకు రావాలని కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ కుమారిడి మృతిపై అనుమానం ఉంద‌న్నారు. న‌మ్మి ఇక్క‌డికి పంపామ‌ని, ఎలా చ‌నిపోయాడో త‌మ‌కు తెలియాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. గొంతు మీద ఎటువంటి గాయాలు లేవ‌ని, ఆత్మ‌హ‌త్య అని ఎలా న‌మ్మాల‌ని నిల‌దీశారు. క‌ళాశాల యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

కాగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా గురుకుల పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 132 మంది గురుకుల విద్యార్థుల మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. విద్యార్థుల సంర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని త‌ల్లిదండ్రులు కోరుతున్నారు.

 

Advertisement
Advertisement