Parliament | ఆ రోజు లోక్సభలో జరిగింది ఇదే.. కాంగ్రెస్ మహిళా ఎంపీల వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Parliament | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై భౌతిక దాడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే.
Parliament | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై భౌతిక దాడికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఎక్స్లో పోస్టు చేశారు. ఫిబ్రవరి 4న లోక్సభలో (Lok Sabha) జరిగింది ఇదే అంటూ వీడియోని ఎక్స్లో ఉంచారు.
ఆ వీడియోలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని సీటు వద్దకు రావడం కనిపించింది. అక్కడ బ్యానర్ ప్రదర్శించి నిరసన తెలిపారు. అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, పియూష్ గోయల్ సహా బీజేపీ ఎంపీలు.. మహిళా ఎంపీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా, వారు నిరసన కొనసాగించడంతో అధికారపక్షం ఎంపీలు సభ నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియోని పోస్టు చేసిన కిరణ్ రిజుజు.. "కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీల అత్యంత దిగజారుడు ప్రవర్తన పట్ల గర్వపడుతోంది..!! మేము బీజేపీ ఎంపీలందరినీ ఆపకుండా, మహిళా ఎంపీలను కాంగ్రెస్ ఎంపీలతో తలపడేందుకు అనుమతించి ఉంటే.. పరిస్థితి ఏంటి..? మేము పార్లమెంట్ గౌరవాన్ని, పవిత్రను కాపాడతాం. అందుకే అలా చేయలేదు..." అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
https://x.com/KirenRijiju/status/2021082523649073377
ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానానికి ఆమోదం..
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ఫిబ్రవరి 4న ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే, ప్రధానిపై దాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం రావడంతో.. ఆ రోజు సభను వాయిదా వేశారు. ఇక తర్వాతి రోజు ఉదయం అంటే ఫిబ్రవరి 5న ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై (Presidents Address) ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగం లేకుండానే దీనికి ఆమోదం లభించడం గమనార్హం.
"రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ప్రధాని నిన్న సభలో అందుబాటులోనే ఉన్నారు. కానీ, లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిని చుట్టుముట్టి దాడికి ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం అందింది. ఇందుకోసం మహిళా ఎంపీలను పంపారు. అందుకే సభను వాయిదా వేయాల్సి వచ్చింది" అని ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






