West Bengal Elections | పశ్చిమబెంగాల్లో రెండో దశ ఎన్నికలు.. 142 స్థానాల్లో పోలింగ్
West Bengal Elections | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికల (West Bengal Elections) పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ (Phase 2 Polling) సాగనుంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్లో ఏప్రిల్ 23న మొదటి దశలో భాగంగా 152 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మిగిలిన 142 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది.
West Bengal Elections | త్రినేత్ర.న్యూస్: పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికల (West Bengal Elections) పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ (Phase 2 Polling) సాగనుంది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్లో ఏప్రిల్ 23న మొదటి దశలో భాగంగా 152 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం మిగిలిన 142 స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. రెండో విడుతలో మొత్తం 1,448 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరి భవితవ్యాన్ని3,21,73,837 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు, 1,57,37,418 మంది మహిళలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరికోసం 41 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
మే 4న ఫలితాలు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీలతో బందోబస్తు ఏర్పాటు చేసింది. మొదటి విడతలో రికార్డు స్థాయిలో 93.19 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడతలోనూ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. మే 4న బెంగాల్తో పాటు అస్సాం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.
టీఎంసీ కంచుకోటలు..
కాగా, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్కు (TMC) కంచుకోటలైన ఉత్తర 24 పరగణాలు (33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు (31 సీట్లు), హౌరా (16), నదియా (17), హుగ్లీ (18), పూర్బా బర్ధమాన్ (16), కోల్కతా (11 సీట్లు) జిల్లాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ విజయం సాధించాయి. అయితే పలు చోట్ల బీజేపీ కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. 14 సీట్లలో కేవలం 10వేల తేడాతో ఓడిపోతే, 50 సీట్లను 25 వేల తేడాతో కోల్పోయింది. దీంతో ఆయా స్థానాల్లో మరింత పట్టు సాధించింది. దీంతో ఇరుపార్టీల మధ్య ఈ సారి గట్టి పోటీ నెలకొన్నది.
బీజేపీకి సర్ ముప్పు
అయితే బీజేపీ గెలుపు, ఓటములను ‘సర్’ (SIR) ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాల్లో భారీగా ఓట్లను తొలగించారు. దీంతో పోలింగ్పై ప్రభావం పడనుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇక తన కంచుకోట భవానీపూర్ నుంచి టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు.
సంబంధిత వార్తలు

Falta Repoll | “పుష్ప” తగ్గాడు: పోలింగ్కు ముందే తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి
మే 19, 2026

Suvendu Adhikari | నందిగ్రామ్ను వదులుకున్న సువేందు అధికారి.. దీదీ మరో నియోజకవర్గం చూసుకోక తప్పదా!
మే 14, 2026

Indiramma Indlu | సర్కార్ శుభవార్త.. జూన్ 2 నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో దశ పంపిణీ
మే 13, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



