త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | శోభ‌నం గ‌దిలా మారిన రైలు కోచ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌..!

Viral Video | రైలులోని ఓ ఫస్ట్ ఏసీ కోచ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా ప్రయాణానికి ఉపయోగించే రైలు బోగీని నూతన దంపతుల కోసం హనీమూన్ సూట్‌లా రెడీ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వినూత్న ప్రయత్నంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్ల‌కు అనుమ‌తి ఇవ్వడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

P

National | Published On Jul 8, 2026, 6.59 pm IST

Viral Video | శోభ‌నం గ‌దిలా మారిన రైలు కోచ్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌..!
Advertisement

Viral Video | రైలులోని ఓ ఫస్ట్ ఏసీ కోచ్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాధారణంగా ప్రయాణానికి ఉపయోగించే రైలు బోగీని నూతన దంపతుల కోసం హనీమూన్ సూట్‌లా రెడీ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వినూత్న ప్రయత్నంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్ల‌కు అనుమ‌తి ఇవ్వడం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మహారాష్ట్రలో ప్రయాణిస్తున్న ఓ రైలులో ఈ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఓ ఫస్ట్ ఏసీ క్యాబిన్‌ను బెలూన్స్‌, పూలు, గులాబీ రేకుల‌తో అందంగా అల‌రించారు. రైలు లోప‌ల ఐ ల‌వ్ యూ అంటూ పోస్ట‌ర్లు వేశారు.

జాల్నాకు చెందిన నూతన దంపతుల కోసం ఔరంగాబాద్‌కు చెందిన ‘రాహత్ రూమ్ డెకరేషన్’ బృందం ఈ అలంకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. రైలు జాల్నా స్టేషన్‌కు చేరుకునేలోపే కోచ్‌ను సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సదరు జంట ఫస్ట్ ఏసీ క్యాబిన్‌లోని రెండు బెర్తులను ముందుగానే రిజర్వ్ చేసుకోవడంతో ఈ ఏర్పాట్ల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం రాలేదని వారు వెల్లడించారు. వీడియో వైర‌ల్ కావ‌డంతో రైల్వే అధికారులు కూడా స్పందించారు. ప్రయాణికులు మొత్తం క్యాబిన్‌ను బుక్ చేసుకున్న నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘ‌న జ‌రుగ‌లేద‌ని స్పష్టం చేశారు. రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకుండా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటే వ్యక్తిగతంగా కేటాయించిన క్యాబిన్‌లో పరిమిత స్థాయిలో డెక‌రేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీన్ని సరదాగా ‘హనీమూన్ ఆన్ వీల్స్’, ‘సుహాగ్‌రాత్ ఎక్స్‌ప్రెస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బెలూన్లు, అలంకరణ సామగ్రి వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, పరిశుభ్రతపై ప్రభావం పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై స్ప‌ష్టత ఇవ్వాలంటూ ప‌లువురు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement