Vandemataram | ‘జనగణమన’కు ఇచ్చిన గౌరవం వందేమాతరానికీ దక్కాలి: నడ్డా
నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా? అంటూ మండిపడ్డారు.
Vandemataram | వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్లో ఇటీవల దీనిపై ప్రధాని మోదీ ప్రత్యేక చర్చ నిర్వహించారు. వందేమాతరం విశిష్టతను ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. రాజ్యసభలోనూ వందేమాతరం గురించి చర్చ నిర్వహించారు. దీనిపై బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాజ్యసభలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జాతీయ సమైక్యతకు వందేమాతరం కృషి చేసిందని, భారత స్వాతంత్య్ర పోరాట సమయంలో దేశ ప్రజలను ఐక్యం చేసిన ఘనత వందేమాతరానికి దక్కుతుందన్నారు. అందుకే జాతీయ గీతం అయిన జనగనమణతో సమానంగా వందేమాతరానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని కొన్ని చరణాలను తొలగించి దేశ విభజనకు ఆజ్యం పోసిందని ఆరోపించారు.
దేశాన్ని ఏకం చేసిన మంత్రం
వందేమాతరం దేశాన్ని ఏకం చేసిన మంత్రం అని, అదే బ్రిటీష్ వాళ్లను భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా చేపట్టిన ప్రత్యేక చర్చను రాజ్యసభలో జేపీ నడ్డా ఈ వ్యాఖ్యలు చేసి ముగించారు.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కించపరచడం కోసమో, అపకీర్తిపాలు చేయడం కోసమో ఈ చర్చ పెట్టలేదు. సందర్భం వచ్చింది కాబట్టి భారతదేశ చరిత్రను గుర్తుచేసుకోవడం కోసమే అని స్పష్టం చేశారు.
జనగణమన కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా
జనగణమనకు నేను గౌరవం ఇస్తాను. దాని కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధం. కానీ.. వందేమాతరం విషయంలో జరిగిన ఘటన అప్పుడు నాయకుడే బాధ్యత తీసుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నది ఎవరో కాదు.. జవహర్లాల్ నెహ్రూ.. అని గుర్తు చేశారు.
ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా?
నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందించింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈ చర్చ నెహ్రూ మీదనా? లేక వందేమాతరం మీదనా? అంటూ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



