Vande Mataram | ఇకపై వందేమాతరం తప్పనిసరి.. జనగణమనకంటే ముందే ఆలపించాలి : కేంద్ర ప్రభుత్వం
Vande Mataram | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు (Jana Gana Mana) ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం' ను (Vande Mataram) ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.
Vande Mataram | కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు (Jana Gana Mana) ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం' ను (Vande Mataram) ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమాల్లోనూ, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని ఇతర కార్యక్రమాల్లో కూడా వందేమాతరం ఆలపించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. సినిమా థియేటర్లలో ఈ గేయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని తెలిపింది. జాతీయ గీతాన్ని లేదా గేయాన్ని ఆలపించేటప్పుడు ఎవరైనా అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అలాంటి వారికి గరిష్టంగా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్లు స్పష్టం చేసింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో అందరూ తప్పనిసరిగా లేచి నిలబడాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
గతంలో నెహ్రూ ప్రభుత్వం ‘సెక్యులర్’ అంశాలను కారణంగా చూపి, ఈ గేయంలోని చివరి నాలుగు చరణాలను తొలగించింది. అయితే, తాజా ఆదేశాల ప్రకారం పూర్తి గీతాన్ని ‘అధికారిక వెర్షన్’గా పరిగణించాలని, ఈ పూర్తి గేయాన్ని ఆలపించడానికి మూడు నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుందని హోం శాఖ తెలియజేసింది. వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నూతన మార్గదర్శకాలను తీసుకువచ్చారు. వందేమాతరం గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు. గతేడాది నవంబర్ 7 నాటికి ఈ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vande Mataram Trending | నెట్టింట వందే మాతరం ట్రెండింగ్.. విజయ్ ప్రమాణం స్వీకారోత్సవంలో ఇదే హైలెట్..!
మే 10, 2026

MM Keeravani | కర్తవ్య పథ్లో కీరవాణి స్వరార్చన: 2,500 మంది కళాకారులతో భారీ ప్రదర్శన
జనవరి 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



