త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MM Keeravani | కర్తవ్య పథ్‌లో కీరవాణి స్వరార్చన: 2,500 మంది కళాకారులతో భారీ ప్రదర్శన

రిపబ్లిక్ వేడుకలకు విదేశాల నుంచి పలువురు డెలిగేట్స్ రానున్నారు. యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లుయిస్ శాంటోస్ ద కోస్టా, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్ డెర్ లెయెన్ వేడుకలకు హాజరుకానున్నారు.

J

Entertainment | Published On Jan 19, 2026, 7.33 pm IST

MM Keeravani | కర్తవ్య పథ్‌లో కీరవాణి స్వరార్చన: 2,500 మంది కళాకారులతో భారీ ప్రదర్శన
Advertisement

MM Keeravani | వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఇప్పటికే కేంద్రం 150 ఏళ్ల వందేమాతరం వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ వందేమాతరంపై ప్రత్యేక చర్చను నిర్వహించింది. వందేమాతరం గేయం విశిష్టత, స్వాతంత్య్రోద్యమంలో దాని పాత్రపై దేశానికి తెలిసేలా పార్లమెంట్‌లో ఎంపీలు చర్చించారు. కేంద్రం కూడా వందేమాతరం గేయానికి జనగణమనకు దక్కిన గౌరవమే ఇస్తామని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో త్వరలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వందేమాతరం గేయాన్ని ప్రత్యేకంగా పలువురు కళాకారులతో సరికొత్త సంగీతాన్ని కంపోజ్ చేసి ప్రదర్శించనున్నారు.

జనవరి 26న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరుగనున్న రిపబ్లిక్ డే వేడుకల కోసం ఆస్కార్ విజేత, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీత స్వరకల్పన చేయనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2500 మంది కళాకారులతో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తాను పొందిన గొప్ప గౌరవం ఇది అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. మనమంతా కలిసి జాతీయ భావాన్ని పెంపొందించేలా కలిసి వేడుక చేసుకోవాలి. వందేమాతరం అంటూ కీరవాణి ట్వీట్‌లో చెప్పుకొచ్చారు.

జనవరి 26 వేడుకల కోసం రిహార్సల్స్

మరోవైపు ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో 77వ రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈసారి రిపబ్లిక్ వేడుకలకు విదేశాల నుంచి పలువురు డెలిగేట్స్ రానున్నారు. యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటోనియో లుయిస్ శాంటోస్ ద కోస్టా, యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వొన్ డెర్ లెయెన్ వేడుకలకు హాజరుకానున్నారు. అనంతరం జనవరి 27న జరగనున్న 126వ ఈయూ-భారత్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.

https://x.com/mmkeeravaani/status/2013136144368845177

Advertisement

తాజావార్తలు

Advertisement