Union Budget 2026 | తెలంగాణను విస్మరించిన మోదీ సర్కార్.. కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలివే..
Union Budget 2026 | వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ముందుకు తీసుకెళ్లారు.
Union Budget 2026 | వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరమైన వృద్ధి (Stability Growth), మితమైన ద్రవ్యోల్బణంతో (Moderate Inflation) సాగుతోందన్నారు. ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితం కాకుండా, సంస్కరణలు, ఆచరణాత్మక నిర్ణయాల వైపు మొగ్గు చూపినట్లు చెప్పారు. అయితే, ఈ బడ్జెట్లో తెలంగాణను మోదీ సర్కార్ విస్మరించింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. హైస్పీడ్ రైళ్లు తప్ప ఎలాంటి ప్రత్యేక పథకాలనూ ప్రకటించకపోవడం గమనార్హం.
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివే..
- FY27 ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయాన్ని రూ. 12.2 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇది దేశ చరిత్రలోనే అత్యధికం.
- 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును GDPలో 4.3 శాతం వద్ద అంచనా వేశారు.
- GDP నిష్పత్తిలో అప్పులు 56.1 శాతం నుంచి 55.6 శాతంకి తగ్గుతాయని అంచనా వేశారు.
- మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.53.5 లక్షల కోట్లు కాగా, నికర పన్ను రాబడి రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
- రక్షణ రంగానికి రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు.
- నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయించారు.
- ఏడు హై స్పీడ్ కారిడార్లు.. (ముంబై - పుణె, పుణె - హైదరాబాద్, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై, చెన్నై - బెంగళూరు, ఢిల్లీ - వారణాసి, వారణాసి - సిలిగురి)
- పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు, వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 20 కొత్త జలమార్గాలను (Waterways) అందుబాటులోకి తేనున్నారు.
- పారిశ్రామిక రంగానికి, ముఖ్యంగా ఫార్మా, చిన్న పరిశ్రమలకు (MSME) పెద్దపీట
- బలమైన దేశీయ తయారీ రంగాన్ని నిర్మించడం, ఇంధన భద్రతను మెరుగుపరచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి.
- భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మా తయారీ హబ్గా (Global Biopharma Hub) తీర్చిదిద్దేందుకు 'బయోఫార్మా శక్తి' (Biopharma Shakti) పథకం.. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ10,000 కోట్ల కేటాయింపులు.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రూ.10,000 కోట్ల నిధి
- మైక్రో ఎంటర్ప్రైజెస్ (Micro Enterprises) కోసం రూ.2,000 కోట్ల నిధి
- జౌళి రంగాన్ని ప్రోత్సహించేందుకు 'నేషనల్ ఫైబర్ స్కీమ్'
- టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి (Skilling system) కోసం కొత్త ప్రణాళిక
- రేర్ ఎర్త్ కారిడార్లు: దేశంలో 3 'రేర్ ఎర్త్ కారిడార్ల' (Rare Earth Corridors) ఏర్పాటు
- దేశ సెమీకండక్టర్ వృద్ధి కోసం సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0ని (Semiconductor mission 2.0). ఇందుకోసం రూ.40,000 కోట్లు కేటాయింపు.
- నేషనల్ ఫైబర్ ప్రణాళిక కింద పట్టు, జనపనారకు ప్రాధాన్యం.
- క్రీడా వస్తువుల తయారీ, ఆవిష్కరణ, పరిశోధనలపై ప్రాధాన్యత.
- 20 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో 10వేల మంది గైడ్ల నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రణాళిక.
- నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఏర్పాటు.
- హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, అరకు లోయలో రోడ్ల అభివృద్ధి.
- 2026-27లో మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచే ప్రతిపాదన.
- చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు.
- 500 రిజర్వాయర్లలో చేపల పెంపకం, అభివృద్ధికి చర్యలు.
- పశు సంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు.
- వ్యవసాయ ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సాహం. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల నాటకానికి ప్రోత్సాహం.
- గ్రామీణ చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 'మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్' పథకాన్ని ప్రకటించింది. ఖాదీ, చేనేత, హస్తకళల (Handicrafts) రంగాలను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యంగా నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
- ఒడిశాలోని ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలను జలమార్గాల ద్వారా అనుసంధానించనున్నారు.
- దేశంలో మూడు ఆయుర్వేద ఆసుపత్రుల ఏర్పాటు.
- భారతదేశాన్ని 'గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ హబ్'గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా నిర్మలమ్మ తెలిపారు.
- క్యాన్సర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు మందులను సరసమైన ధరలకు అందుబాటులోనే ఉంచనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.
- 17 రకాల క్యాన్సర్ మందులకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చారు.
- ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం
- విదేశాలకు వెళ్లే భారతీయులకు బడ్జెట్లో భారీ ఊరట లభించింది.
- వ్యక్తిగత వినియోగం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని (Tariff) 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.
- రూ.20 లక్షల కంటే తక్కువ విలువైన విదేశీ ఆస్తులను (స్థిరాస్తి కాకుండా) వెల్లడించని వారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
- ఫ్యూచర్స్ మార్కెట్లో STTని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు.
- ప్రవాస భారతీయులు (Non-residents) ఆస్తి అమ్మినప్పుడు, కొనుగోలుదారులు తమ పాన్ (PAN) కార్డు ద్వారానే TDS చెల్లించవచ్చు. ప్రత్యేకంగా TAN నంబర్ అవసరం లేదు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



