త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Derailed | ఉత్త‌రాఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. మూడు రోజుల్లో మూడో ఘ‌ట‌న‌

Train Derailed | దేశంలో మ‌రో రైలు ప్ర‌మాదానికి (Train Derailed) గురైంది. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ (Ujjaini Express) పట్టాలు తప్పింది. దీంతో ఓ బోగీ పూర్తిగా ధ్వంస‌మైంది.

G

National | Published On May 19, 2026, 7.43 am IST

Train Derailed | ఉత్త‌రాఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. మూడు రోజుల్లో మూడో ఘ‌ట‌న‌
Advertisement

Train Derailed | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో మ‌రో రైలు ప్ర‌మాదానికి (Train Derailed) గురైంది. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్‌ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ (Ujjaini Express) పట్టాలు తప్పింది. దీంతో ఓ బోగీ పూర్తిగా ధ్వంస‌మైంది. అయితే ప్ర‌మాద స‌మ‌యంలో రైలులో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింది. దేశ‌వ్యాప్తంగా గ‌త మూడో రోజులుగా వ‌రుస‌గా రైళ్లు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయి.

సోమ‌వారం అర్ధ‌రాత్రి రుషికేశ్‌ సమీపంలో ఖాంద్‌ గ్రామం వద్ద యోగనగరి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జ‌రిగింది. ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రంతా రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ బృందాలు సంఘటనా స్థలంలో పనిచేశాయి. ప‌ట్టాలు త‌ప్పిన బోగీల‌ను మ‌ళ్లీ ట్రాక్ ఎక్కించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం ప్ర‌యాణం కోసం రైలును సిద్ధం చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అయితే, ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింద‌న్న విష‌యంపై అధికారులు ఇంకా స్ప‌ష్ట‌తనివ్వ‌లేదు. లోకోపైల‌ట్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇది జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement