త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | ఆ ప్ర‌చారం వాస్త‌వ దూరం.. క్యూలైన్‌లో భ‌క్తురాలికి పాముకాటుపై టీటీడీ..

TTD | త్రినేత్ర‌.న్యూస్‌: తిరుమ‌ల (Tirumala) శ్రీవారి ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఓ మ‌హిళా భ‌క్తురాలిని పాము క‌రిచింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఖండించింది. వివిధ ప్ర‌సార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని తెలిపింది.

G

National | Published On Feb 23, 2026, 12.09 pm IST

TTD | ఆ ప్ర‌చారం వాస్త‌వ దూరం.. క్యూలైన్‌లో భ‌క్తురాలికి పాముకాటుపై టీటీడీ..
Advertisement

TTD | త్రినేత్ర‌.న్యూస్‌: తిరుమ‌ల (Tirumala) శ్రీవారి ద‌ర్శ‌న క్యూలైన్‌లో ఓ మ‌హిళా భ‌క్తురాలిని పాము క‌రిచింద‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఖండించింది. వివిధ ప్ర‌సార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా వాస్తవ దూరమని తెలిపింది.

`తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్యాక్సీలో మ్యూజియం సమీపంలో ఉన్న ఆర్‌బీసెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకట్లో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లారు. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయబ్రాంతులకు లోనయ్యారు. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది.

వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించే ఎలాంటి పాము కాటు లేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు.

కాగా, ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. బాధిత భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సోమ‌వారం ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకున్నారు` అని టీటీడీ వెల్ల‌డించింది.

భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుంచి మాత్రమే క్యూలైన్లలోకి వెళ్లాల‌ని, తిరుమల పరిసరాల్లోని నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని విజ్ఞ‌ప్తిచేసింది.

Advertisement
Advertisement