త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Travels Bus | కావేరీ ట్రావెల్స్‌లో మంట‌లు.. హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వెళ్తున్న బ‌స్సు

Travels Bus | హైద‌రాబాద్ (Hyderabad) నుంచి తిరుప‌తి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) అగ్నికి ఆహుత‌య్యింది. సిబ్బంది అప్ర‌మ‌త్త‌తో పెను ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. చూస్తుండ‌గా బ‌స్సు మంట‌ల్లో కాలిబూడిద‌యింది.

G

National | Published On May 15, 2026, 10.06 am IST

Travels Bus | కావేరీ ట్రావెల్స్‌లో మంట‌లు.. హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వెళ్తున్న బ‌స్సు
Advertisement

Travels Bus | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ (Hyderabad) నుంచి తిరుప‌తి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus) అగ్నికి ఆహుత‌య్యింది. సిబ్బంది అప్ర‌మ‌త్త‌తో పెను ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. చూస్తుండ‌గా బ‌స్సు మంట‌ల్లో కాలిబూడిద‌యింది.

కావేరీ ట్రావెల్స్ (Kaveri Travels) బ‌స్సు 36 మంది ప్ర‌యాణికుల‌తో హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వెళ్తున్నది. ఈ క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా ఉల‌వ‌పాడు మండ‌లం భీమ‌వ‌రం అడ్డ‌రోడ్డు వ‌ద్ద.. ఇంజిన్ నుంచి పొగ‌రావ‌డాన్ని గుర్తించిన డ్రైవ‌ర్ బ‌స్సును ప‌క్క‌కు ఆపేశారు. మంట‌లు అంటుకోవ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంట‌నే ప్ర‌యాణికుల‌ను కిందికి దించేశారు. దీంతో ప్ర‌యాణికులంతా పెను ప్ర‌మాదం నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. చూస్తుండ‌గానే బ‌స్సు మొత్తం కాలిపోయింది.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపుచేశారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

Advertisement
Advertisement