Tragedy in Rajahmundry | రాజమండ్రిలో దారుణం.. వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు
Medical Student | ఏపీలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటనలో ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారకులైన ఇద్దరు యువకులను రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- బ్రెయిన్డెడ్గా ప్రకటించిన వైద్యులు
- పశ్చిమబెంగాల్ ఘటన తరహాలోనే చేశారంటూ వైద్యుల ఆగ్రహం
Tragedy in Rajahmundry | త్రినేత్ర.న్యూస్: ఏపీలోని రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటనలో ఆమెను వైద్యులు బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారకులైన ఇద్దరు యువకులను రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఘటన తరహాలోనే ఈ ఘటన జరిగిందని రాజమండ్రి వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి సెంట్రల్ జోన్ డీఎస్పీ ఎ. సుభాష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్ ప్రియాంక (28) జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ చేస్తోంది. ఈనెల 3న రాజమండ్రి ఏవీ అప్పారావ్ రోడ్లోని ప్రసాదిత్యా మాల్లో సినిమా చూసేందుకు వెళ్లింది. అనంతరం స్కూటీపై బయటికి వస్తోంది. ఈ సమయంలో ఇద్దరు యువకులు ఆమె వెళ్తున్న స్కూటీకి డ్యాష్ ఇచ్చారు. ఇదేంటని ప్రశ్నించగా మరోసారి వేగంగా ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా ఆమె తలపై నుంచి కారును పోనిచ్చారు. యువతికి తీవ్ర గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన రాజమండ్రిలోని స్వతంత్ర ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. చివరి అవకాశంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటన సమయంలో నిందితులు ఇద్దరూ మద్యం సేవించారని.. మాల్లోకి సినిమా చూసేందుకు రావడంతో తనిఖీలు చేసిన మాల్ సిబ్బంది వారిని అనుమతించలేదని డీఎస్పీ తెలిపారు. బయటకు వెళ్తూ గేటు వద్ద స్కూటీని ఢీకొట్టి పారిపోయారన్నారు. నామవరానికి చెందిన నిందితులైన ఇంజినీరింగ్ విద్యార్థులు సురావరపు దస్వంత్ ఎ1గా, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్ A2గా చేర్చి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మాల్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.
రాజమండ్రిలో దారుణం
జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ
పీజీ చేస్తున్న 28 ఏళ్ల డాక్టర్ ప్రియాంకరెండు రోజుల క్రితం రాజమండ్రి ఏవీ అప్పారావ్ రోడ్ లోని ప్రసాదిత్యా మాల్ లో సినిమాకు వెళ్లిన
సందర్భంగా పార్కింగ్ లో డాక్టర్ ప్రియాంక కారును ఢీకొట్టిన ఇద్దరు యువకులు కారు… pic.twitter.com/JLXzdPgJeA— RTV (@RTVnewsnetwork) August 6, 2026
సంబంధిత వార్తలు

BRS Leaders | జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే
ఆగస్టు 6, 2026

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి నేనున్నా
ఆగస్టు 6, 2026

Jagadeesh Reddy | మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలే.. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని ఓ సన్నాసి అన్నడు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●BRS Leaders | జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే
- ●WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
- ●Congress survey | ఇప్పుడే ఎన్నికలొస్తే బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే
- ●Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
- ●ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏది బెస్ట్..?

Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

BRS Leaders | జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే

WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..

Congress survey | ఇప్పుడే ఎన్నికలొస్తే బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే



