Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ20 ఇంధన (E20 fuel) పర్యావరణానికి అనుకూలం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు. దీని వెనుక నీటి వనరుల విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు వంటి పర్యావరణ వ్యతిరేక కోణాలు ఉన్నాయని చెప్పారు.
Jairam Ramesh | కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ20 ఇంధన (E20 fuel) కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాలు పర్యావరణ అనుకూలమైనవి కావని కాంగ్రెస్ (Congress) పార్టీ ఆరోపించింది. దీని వెనుక నీటి వనరుల విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు వంటి పర్యావరణ వ్యతిరేక కోణాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) ఆరోపించారు.
స్వచ్ఛ ఇంధనం, చమురు దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ20 ఇంధనాన్ని వేగంగా అమల్లోకి తేవాలని యోచిస్తోందని జైరామ్ రమేష్ అన్నారు. అయితే దీనివల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అన్ని కోణాల నుంచి లోతుగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ20 ఇంధనం వల్ల నీటి వనరులు, ఆహార భద్రతపై పడే ప్రభావం ఎంతనేది పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇతర దేశాలు ఎక్కువగా వ్యవసాయ వ్యర్థాలు, ఇతర వ్యర్థ జీవపదార్థాల నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు. కానీ మన దేశంలో ఇథనాల్ ఉత్పత్తి ప్రధానంగా నీరు ఎక్కువగా అవసరమయ్యే చెరకు, వరి, మొక్కజొన్న వంటి పంటలపై ఆధారపడి ఉందన్నారు.
70% నీరు వరి, చెరకుకే..
అధిక నీటి వినియోగం గల ఈ పంటలు మన వనరులపై చూపుతున్న ఒత్తిడి ఆందోళనకరంగా ఉందన్నారు. భారతదేశంలోని సాగునీటిలో దాదాపు 70 శాతం చెరకు, వరి పంటకే పోతోందని చెప్పారు. ఒక లీటరు చెరకు ఇథనాల్కు 3,630 లీటర్లు, వరి ఇథనాల్కు 10,790 లీటర్ల నీరు అవసరమవుతుందని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్న ఆధారిత ఇథనాల్కు కూడా ఒక లీటరు ఇంధనానికి సుమారు 4,670 లీటర్ల నీరు అవసరమని వివరించారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఈ గణాంకాలు ప్రత్యేకంగా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. 2021 నాటి నీతి ఆయోగ్ ఇథనాల్ రోడ్మ్యాప్ ఆహారేతర, సుస్థిరమైన ఫీడ్స్టాక్ల (ముడి పదార్థాల) వినియోగాన్ని పెంచాలని సిఫార్సు చేసిందని ఈ సందర్భంగా జైరామ్ రమేష్ గుర్తు చేశారు. కానీ మోదీ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తి కోసం బియ్యం వినియోగాన్ని సబ్సిడీ చేస్తోందని ఆరోపించారు. డిస్టిలరీలకు సగటు సేకరణ ధర కంటే 40 శాతం తక్కువకే వరిని సరఫరా చేస్తూ ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
Also Read..
నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
సంబంధిత వార్తలు

Mettu Sai Kumar | అరవింద్ లాంటి దగుల్బాజీ.. నిజామాబాద్ ఎంపీ కావడం దురదృష్టం: మెట్టు సాయి కుమార్
ఆగస్టు 6, 2026

Congress | నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ సీనియర్లకే 60 శాతం పదవులు..
ఆగస్టు 6, 2026

Nitin Gadkari | అసహ్యకరమైన కంటెంట్ను తొలగించండి.. ఈ20 వివాదంలో నితిన్ గడ్కరీకి ఊరట
ఆగస్టు 5, 2026
తాజావార్తలు
- ●Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి నేనున్నా
- ●NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం
- ●ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..
- ●Jagadeesh Reddy | మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలే.. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని ఓ సన్నాసి అన్నడు
- ●Arvind Kejriwal | నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
- ●Mettu Sai Kumar | అరవింద్ లాంటి దగుల్బాజీ.. నిజామాబాద్ ఎంపీ కావడం దురదృష్టం: మెట్టు సాయి కుమార్

Komatireddy Venkat Reddy | రూ.5 కోట్ల బకాయిలకు రూ.54 కోట్ల నోటీసు ఎలా ఇస్తారు? కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి నేనున్నా

NEET Student | కానూరులో నీట్ కోచింగ్.. కుటుంబానికి దూరంగా ఉండలేక హైదరాబాద్ యువతి బలవన్మరణం

ASUS Chromebook CX15 | తక్కువ ధరకే అసుస్ కొత్త క్రోమ్బుక్.. గూగుల్ ఏఐ ఫీచర్లతో..

Jagadeesh Reddy | మేధావినని జయశంకర్ సార్ ఎన్నడూ చెప్పుకోలే.. తెలంగాణల ఇద్దరే మేధావులున్నరని ఓ సన్నాసి అన్నడు



