త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | భార్య చీర‌ల‌తో ముగ్గురు బిడ్డ‌ల‌కు ఉరి.. ఆపై ఆత్మ‌హ‌త్య‌

Murder | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. భార్య చీర‌ల‌తో త‌న ముగ్గురు బిడ్డ‌ల‌కు ఉరేశాడు. ఆ తర్వాత తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

S

National | Published On Dec 15, 2025, 6.32 pm IST

Murder | భార్య చీర‌ల‌తో ముగ్గురు బిడ్డ‌ల‌కు ఉరి.. ఆపై ఆత్మ‌హ‌త్య‌
Advertisement

Murder | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌. భార్య చీర‌ల‌తో త‌న ముగ్గురు బిడ్డ‌ల‌కు ఉరేశాడు. ఆ తర్వాత తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలోని మిశ్రౌలియా గ్రామానికి చెందిన అమ‌ర్నాత్ రామ్‌కు కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. ఆయ‌న‌కు భార్య‌, ఐదుగురు పిల్ల‌లు ఉన్నారు. గ‌తేడాది భార్య చ‌నిపోగా, పిల్ల‌ల ఆల‌నాపాల‌నా తానే చూసుకుంటున్నాడు. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. త‌న ముగ్గురు ఆడ‌బిడ్డ‌ల‌కు భార్య చీర‌ల‌తో ఉరేశాడు. అనంత‌రం తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఐదుగురిలో ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు ఈ ఘ‌ట‌న నుంచి త‌ప్పించుకున్నారు. మృతి చెందిన పిల్ల‌ల‌ను అనురాధ‌(12), శివాని(7), రాధిక‌(6)గా పోలీసులు గుర్తించారు. ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌ల‌ను శివమ్‌(6), చంద‌న్‌(5)గా గుర్తించారు.

ఈ ఘ‌ట‌న‌పై ప‌లు సందేహాలు

అమ‌ర్నాథ్ త‌న పిల్ల‌ల‌కు ఉరేసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. భార్య చ‌నిపోయాక పిల్ల‌ల పోష‌ణ అమ‌ర్నాథ్‌కు భారంగా మారింద‌ని, ఈ నేప‌థ్యంలో వారిని చంపి తాను ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని స్థానికులు భావించారు. ప్ర‌యివేటు ఫైనాన్స్ సంస్థ‌ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించ‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ని, ఈ క్ర‌మంలోనే ఈ దారుణానికి ఒడిగ‌ట్టి ఉండొచ్చ‌ని మ‌రికొంద‌రు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు మ‌రిన్ని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. పిల్ల‌ల‌ను ఎందుకు చంపాల్సి వ‌చ్చింది..? అమ‌ర్నాథ్ ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.

రాత్రి భోజ‌నం కోడిగుడ్ల కూర‌తో..

తండ్రి అమ‌ర్నాథ్ ఈ అఘాయిత్యానికి పాల్ప‌డే ముందు పిల్ల‌ల‌కు కోడిగుడ్ల కూర‌తో భోజ‌నం వ‌డ్డించిన ఆన‌వాళ్లు క‌నిపించాయి. ఆ త‌ర్వాత పిల్ల‌లంద‌ర్నీ వ‌రుస‌గా నిల‌బెట్టి.. భార్య చీర‌ల‌తో ఉరేసిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్ద‌రు మ‌గ పిల్ల‌లు ఈ ఘ‌ట‌న నుంచి త‌ప్పించుకున్నారు. ఆరేండ్ల శివ‌మ్ మాట్లాడుతూ.. తాను త‌న తండ్రి ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్న స‌మ‌యంలోనే త‌న అక్క‌ల‌కు ఉరేసిన‌ట్లు తెలిపాడు.

Advertisement

తాజావార్తలు

Advertisement