Iran-US tensions | అమెరికాను ఓడించేందుకు నేవీ సిద్ధంగా ఉంది : మొజ్తాబా ఖమేనీ
Iran-US tensions | హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా బలగాలకు ఎదురు నిలిచేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. శత్రువులకు మరోసారి పరాజయాన్ని రుచి చూపించేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
Iran-US tensions | హార్ముజ్ జలసంధి వద్ద మళ్లీ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా బలగాలకు ఎదురు నిలిచేందుకు ఇరాన్ నౌకాదళం సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. శత్రువులకు మరోసారి పరాజయాన్ని రుచి చూపించేందుకు నౌకాదళం సిద్ధంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాతో సంబంధాలపై ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాల మధ్య పరస్పర అంగీకారం కుదిరే వరకు చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిపై ఒత్తిడి తీసుకురావడం, ఇరాన్ పోర్టులపై దిగ్బంధనం విధించడం వంటి చర్యలను తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఇతర దేశాల విధానాలను నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితి ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ బలగాలు ఒక ఆయిల్ ట్యాంకర్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత రెండు భారత జెండా నౌకలు సహా పలు వాణిజ్య నౌకలు మార్గం మార్చుకుని వెనక్కి మళ్లాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గానీ, నౌకలకు గానీ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఒమన్ తీరానికి సమీపంలో, 20 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఇరాన్కు చెందిన రెండు గన్బోట్లు ట్యాంకర్ను సమీపించి కాల్పులు జరిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇక ఇదే సమయంలో హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను పునరుద్ధరించినట్లు ఇరాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నామని, ఆంక్షలు ఎత్తివేయబడే వరకు నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమారు పది వాణిజ్య నౌకలు తమ ప్రయాణ మార్గాలను మార్చుకున్నట్లు సమాచారం. వీటిలో భారత జెండా నౌకలు కూడా ఉండటం గమనార్హం. భారీ చమురు లోడుతో ప్రయాణిస్తున్న ఒక సూపర్ ట్యాంకర్ కూడా వెనక్కి తిరిగినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ, నౌకాదళం నిశితంగా గమనిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Iran | ఎఫ్-15తో పాటు 180 డ్రోన్లను కూల్చివేశాం..! సైనిక శక్తిపై ప్రపంచానికి ఇరాన్ సందేశం..!
ఏప్రిల్ 19, 2026

Mojtaba Khamenei | కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదు : మొజ్తాబా ఖమేనీ
ఏప్రిల్ 8, 2026

Oil Prices Fall | యుద్ధానికి రెండువారాల బ్రేక్.. భారీగా పతనమైన క్రూడాయిల్ ధరలు..!
ఏప్రిల్ 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



