త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం.. పిటిష‌న్ల‌ను విచారించ‌నున్న సుప్రీంకోర్టు

Supreme Court | కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి (Sabarimala temple) అన్ని వయసుల మహిళలకు ప్ర‌వేశం క‌ల్పించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం త్వ‌ర‌లో విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

D

National | Published On Feb 16, 2026, 4.19 pm IST

Supreme Court | శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం.. పిటిష‌న్ల‌ను విచారించ‌నున్న సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యంలోకి (Sabarimala temple) అన్ని వయసుల మహిళలకు ప్ర‌వేశం క‌ల్పించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం త్వ‌ర‌లో విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టు సోమ‌వారం ప్ర‌క‌టించింది. ఇందుకోసం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.

అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని (Sabarimala women entry) అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ కొంద‌రు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అలా దాదాపు 67 పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. ఈ పిటిష‌న్ల‌న్నింటిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు తాజాగా ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మహిళల ప్రవేశంపై నిషేధం అమలులో ఉన్న వివిధ మతపరమైన ప్రదేశాల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్చి 14లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాలు, ప్రార్థనా స్థలాల నిర్వాహకులను కోర్టు ఆదేశించింది.

ఈ పిటిషన్లపై విచారణ కోసం ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 22 వరకు రెండు వారాల సమయాన్ని కేటాయింయించింది. శబరిమల అంశంతో పాటు దర్గాలు, మసీదుల్లో ముస్లిం మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశం, ఇతర మతాలకు చెందిన వారిని వివాహం చేసుకున్న పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లో ప్రవేశం నిరాకరించడం వంటి విషయాలపై కూడా కోర్టు సమగ్రంగా విచారణ జరపనుంది.

Advertisement
Advertisement