త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijayasai Reddy | మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. మీడియారంగంలోకి కూడా.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Vijayasai Reddy | మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెల నుంచి తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసుతో సంబంధంగా తన నివాసంలో ఈడీ నిర్వహించిన సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

P

National | Published On Apr 24, 2026, 9.20 pm IST

Vijayasai Reddy | మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నా.. మీడియారంగంలోకి కూడా.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!
Advertisement

Vijayasai Reddy | మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెల నుంచి తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసుతో సంబంధంగా తన నివాసంలో ఈడీ నిర్వహించిన సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకే పరిమితం కాకుండా, త్వరలోనే మీడియా రంగంలో కూడా అడుగుపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీపై విమర్శలు గుప్పించిన ఆయన, గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన ఇంట్లో జరిగిన ఈడీ తనిఖీలపై స్పందించిన విజయసాయి రెడ్డి, అధికారులు నిర్వహించిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు బయటపడలేదని చెప్పారు. తన వద్ద ఎటువంటి తప్పుదారి పట్టించే పత్రాలు లభించలేదని స్పష్టం చేశారు. అయితే, విచారణ నిమిత్తం ఈడీ తనను పిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు సుమారు 13 గంటల పాటు కొనసాగి సాయంత్రం ముగిశాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో భారీ అక్రమాలు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. డిజిటల్ చెల్లింపులను తగ్గించి, నగదు లావాదేవీల ద్వారా వచ్చిన నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కోణంలోనే దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం. సోదాల సమయంలో ఇంట్లో ఉన్న విజయసాయి రెడ్డిని అధికారులు మద్యం విధానం రూపకల్పన, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన నివాసం నుంచి పలు ముఖ్యమైన పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటిలోని డేటాను పరిశీలించి కేసులో కీలక అంశాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఈడీ ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇతర అనుమానితుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు రాజకీయ ప్రేరేపితమని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తుండగా, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశముందని సమాచారం.

Advertisement
Advertisement