DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్
DK Shivakumar | తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతీసారీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కకుపెట్టి ఐక్యంగా నిలిచిన చరిత్ర ఉందని చెప్పారు. కావేరీ నీటి పంపిణీలో తాగునీటి అవసరాలకే తాము ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు.
DK Shivakumar | త్రినేత్ర.న్యూస్: తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల సంక్షేమమే ముఖ్యమని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతీసారీ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కకుపెట్టి ఐక్యంగా నిలిచిన చరిత్ర ఉందని చెప్పారు. కావేరీ నీటి పంపిణీలో తాగునీటి అవసరాలకే తాము ప్రథమ ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపాదిత బంద్ను విరమించుకోవాలని కన్నడ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నీటి పంపిణీ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము ప్రాధాన్యతనిస్తామన్నారు. రాష్ట్రంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన నీటిని నిల్వ చేశామని తెలిపారు. తీవ్ర నీటి సంక్షోభ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా తమిళనాడుకు 9.9 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న కావేరి జలనిర్వహణ అథారిటీ ఆదేశానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, యడియూరప్ప, వీరప్ప మొయిలీ, సదానందగౌడ, బసవరాజు బొమ్మై, కేంద్రమంత్రులు, కుమారస్వామి, సోమన్న, శోభ కరంద్లాజే, ఉపముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
- ●Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
- ●KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- ●PM Modi | డ్రగ్స్కు దూరంగా ఉండండి..
- ●Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ - ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు

Religious clashes in Nepal | నేపాల్లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..

KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి




