త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srisailam | శ్రీశైలంలో స్ప‌ర్శ ద‌ర్శ‌నాలు బంద్‌.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే?

Srisailam | అస‌లే వేస‌వి సెల‌వులు. ఆపై వారంతం. ఇంకేముంది ఆల‌యాల‌కు క్యూక‌డ‌తారు భ‌క్త‌జ‌నం. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ శైవ‌క్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆల‌యం అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

G

National | Published On May 29, 2026, 11.29 am IST

Srisailam | శ్రీశైలంలో స్ప‌ర్శ ద‌ర్శ‌నాలు బంద్‌.. ఎప్ప‌టివ‌ర‌కు అంటే?
Advertisement

Srisailam | త్రినేత్ర‌.న్యూస్‌: అస‌లే వేస‌వి సెల‌వులు. ఆపై వారంతం. ఇంకేముంది ఆల‌యాల‌కు క్యూక‌డ‌తారు భ‌క్త‌జ‌నం. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ శైవ‌క్షేత్రం శ్రీశైలం (Srisailam) ఆల‌యం అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సోమ‌వారం (జూన్ 1) వ‌రకు మ‌ల్ల‌న్న స్ప‌ర్శ ద‌ర్శ‌నాల‌ను (Sparsha Darshanam) తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది. భక్తుల రద్దీ నేప‌థ్యంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆల‌య‌ ఈవో తెలిపారు.

వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను కూడా తాత్కాలికంగా ర‌ద్దుచేశారు. దీంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా, అందరికీ త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించ‌నున్నారు. ఈ మూడు రోజుల పాటు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. గర్భాలయ ప్రవేశం కానీ, శివలింగాన్ని తాకే అవకాశం కానీ సాధారణ భక్తులకు ఉండదు.

Advertisement
Advertisement