త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bridge Collapsed | తుఫాను ధాటికి కూలిన బ్రిడ్జి.. ఆరుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం

Bridge Collapsed | ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ (Hamirpur) జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూల‌డంతో (Bridge Collapsed) ఆరుగురు కార్మికులు మృతిచెందారు.

G

National | Published On May 29, 2026, 9.47 am IST

Bridge Collapsed | తుఫాను ధాటికి కూలిన బ్రిడ్జి.. ఆరుగురు కార్మికులు దుర్మ‌ర‌ణం
Advertisement

Bridge Collapsed | త్రినేత్ర‌.న్యూస్‌: ఉత్తర ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ (Hamirpur) జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూల‌డంతో (Bridge Collapsed) ఆరుగురు కార్మికులు మృతిచెందారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

హ‌మీర్‌పూర్ జిల్లాలోని మొర‌కంద‌ర్ నుంచి కందౌర్ వ‌ర‌కు బెత్వా నదిపై (Betwa river) వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో తుఫాను కార‌ణంగా బ‌ల‌మైన గాలులు (storm) వీచాయి. దీంతో నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్, పిల్లర్‌తో పాటు స్కాఫోల్డింగ్ నిర్మాణం కూలిపోయింది.

ఆ స‌మ‌యంలో బ్రిడ్జి కింద నిద్రిస్తున్న కార్మికుల‌పై శిథిలాలు, నిర్మాణానికి ఉప‌యోగిస్తున్న సెంట్రింగ్ ప‌రిక‌రాలు ప‌డిపోయాయి. దీంతో ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఆరుగురు కార్మికులు మర‌ణించారు. మ‌రో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయార‌ని, వారిని ర‌క్షించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని అధికారులు తెలిపారు. వారు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

Advertisement
Advertisement