త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Intensive Revision (SIR) | దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఓటర్లు ఔట్.. యూపీలో భారీగా 2.8 కోట్ల పేర్లు తొలగింపు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షల ఓటర్లను తొలగించారు. కేరళలో సుమారు 22 లక్షల మంది ఓటర్లను తొలగించారు.

J

National | Published On Jan 7, 2026, 4.00 pm IST

Special Intensive Revision (SIR) | దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఓటర్లు ఔట్.. యూపీలో భారీగా 2.8 కోట్ల పేర్లు తొలగింపు
Advertisement

Special Intensive Revision (SIR) | దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన భారీ స్థాయిలో జరిగింది. తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 6.5 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండే సుమారు 43 శాతం అంటే 2.89 కోట్ల మంది పేర్లు తొలగించడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్‌లో 18.7 శాతం కోత

2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీలో చేపట్టిన ఈ ప్రక్రియలో మొత్తం ఓటర్లలో 18.7 శాతం మందిపై వేటు పడింది. రాజధాని లక్నోలో అత్యధికంగా 30 శాతం ఓటర్లను తొలగించగా, ఘజియాబాద్ (28.8%), కాన్పూర్ నగర్, బలరాంపూర్ జిల్లాల్లో 25 శాతం కంటే ఎక్కువ మంది పేర్లను జాబితా నుండి తొలగించారు.

తొలగింపునకు గల ప్రధాన కారణాలు ఏంటి?

యూపీలో తొలగించిన 2.89 కోట్ల మంది ఓటర్లలో 2.17 కోట్ల మంది తమ నివాస ప్రాంతంలో లేకపోవడం లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల ఓటర్ల జాబితా నుంచి తొలగించబడ్డారు. 46 లక్షల మంది మరణించినట్లు గుర్తించడంతో వారి పేర్లను తొలగించారు. 25.4 లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం వల్ల తొలగించారు.

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి

యూపీ తర్వాత తమిళనాడు, గుజరాత్‌లలో కూడా భారీగా తొలగింపులు జరిగాయి. తమిళనాడులో 97.2 లక్షల పేర్లు (15% తగ్గుదల), గుజరాత్‌లో 73.76 లక్షల పేర్లు (14% తగ్గుదల) తొలగించగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో 58 లక్షల ఓటర్లను తొలగించారు. కేరళలో సుమారు 22 లక్షల మంది ఓటర్లను తొలగించారు.

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఈ 12 రాష్ట్రాల్లో గణన ప్రక్రియ పూర్తి కావడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను (Draft Electoral Rolls) విడుదల చేశారు. ప్రస్తుతం అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ దశ ప్రారంభమైంది. మార్చి 6వ తేదీన ఉత్తరప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాల తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎవరైనా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే, వారు ఫారం-6 ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement