త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajender | రేవంత్ స‌ర్కారు నిరంకుశ‌త్వానికి ప‌రాకాష్ట : ఈట‌ల రాజేంద‌ర్‌

Etala Rajender | అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల‌పై పోలీసుల చేయ‌డం, రేవంత్ సర్కార్ నిరంకుశత్వానికి పరాకాష్టకు చేరింద‌ని మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శించారు. నాడు ఓట్ల కోసం లైబ్రరీల చుట్టూ తిరిగార‌ని, నేడు అదే విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నార‌ని మండిప‌డ్డారు.

P

Hyderabad | Published On Jan 8, 2026, 8.04 pm IST

Etala Rajender | రేవంత్ స‌ర్కారు నిరంకుశ‌త్వానికి ప‌రాకాష్ట : ఈట‌ల రాజేంద‌ర్‌
Advertisement

Etala Rajender | అశోక్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగుల‌పై పోలీసుల చేయ‌డం, రేవంత్ సర్కార్ నిరంకుశత్వానికి పరాకాష్టకు చేరింద‌ని మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ విమ‌ర్శించారు. నాడు ఓట్ల కోసం లైబ్రరీల చుట్టూ తిరిగార‌ని, నేడు అదే విద్యార్థులపై లాఠీలతో విరుచుకుపడుతున్నార‌ని మండిప‌డ్డారు. రూ.2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏది? అంటూ ప్ర‌శ్నించారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి చికిత్స అందించాల‌న్నారు. ప్రతి నిరుద్యోగికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల‌ని, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈట‌ల డిమాండ్ చేశారు.

అశోక్‌న‌గ‌ర్ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ వ‌ద్ద గురువారం దాదాపు రెండుల‌క్షల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఆందోళ‌న‌కు దిగారు. అయితే గ్రంథాలయం నుంచి అశోక్‌నగర్‌ చౌరస్తాకు ర్యాలీగా రాగా.. వారిని పోలీసుఅఉ అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ప‌లువురు నిరుద్యోగుల‌ను చెద‌ర‌గొట్టిన పోలీసులు.. మ‌రికొంద‌రిని అదుపులోకి తీసుకొని స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement