త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI Summit | ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌లు.. ష‌ర్ట్స్ తీసేసి

AI Summit | ఢిల్లీలో జ‌రుగుతున్నఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌ (India AI Impact Summit 2026)లో యూత్ కాంగ్రెస్ నేత‌లు (Youth Congress Workers) ఆందోళ‌న‌కు దిగారు.

D

National | Published On Feb 20, 2026, 4.00 pm IST

AI Summit | ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌లు.. ష‌ర్ట్స్ తీసేసి
Advertisement

AI Summit | ఢిల్లీలో జ‌రుగుతున్నఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్‌ (India AI Impact Summit 2026)లో యూత్ కాంగ్రెస్ నేత‌లు (Youth Congress Workers) ఆందోళ‌న‌కు దిగారు. ఇటీవ‌లే ఇండియా-యూఎస్ మ‌ధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌కు (India-US Trade Deal) నిర‌స‌న‌గా ఆందోళ‌న చేప‌ట్టారు. చొక్కాలు విప్పి వేదిక వ‌ద్ద నిర‌స‌న (Protest) తెలిపారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళ‌న‌ల‌తో ప్ర‌పంచ నాయ‌కులు, అగ్ర‌శ్రేణి సీఈవోలు పాల్గొన్న స‌మ్మిట్‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

దీంతో నిర్వాహ‌కులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు కొంద‌రు నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిని యూత్ కాంగ్రెస్ జాతీయ కార్య‌ద‌ర్శి కృష్ణ‌హ‌రి, బీహార్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కుంద‌న్ యాద‌వ్‌, యూపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు అజ‌య్ కుమార్‌, యూత్ కాంగ్రెస్ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త న‌ర‌సింహ యాద‌వ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో స‌మ్మిట్ ప్రాంగ‌ణంలో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

స‌మ్మిట్ వేదిక వ‌ద్ద యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌పై బీజేపీ మండిప‌డింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తుంటే.. కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రం దేశ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. నిర‌స‌న‌లు తెలిపిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

https://x.com/ANI/status/2024757981146206518

Advertisement
Advertisement