త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharadchandra Pawar | ఆసుప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్‌.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం..!

Sharadchandra Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురుయ్యారు. దాంతో ముంబ‌యిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 85 ఏళ్ల మాజీ కేంద్ర మంత్రి రెండు రోజుల కింద‌ట బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన‌ట్లుగా సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

P

National | Published On Apr 21, 2026, 3.30 pm IST

Sharadchandra Pawar | ఆసుప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్‌.. నిల‌క‌డ‌గా ఆరోగ్యం..!
Advertisement

Sharadchandra Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురుయ్యారు. దాంతో ముంబ‌యిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 85 ఏళ్ల మాజీ కేంద్ర మంత్రి రెండు రోజుల కింద‌ట బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన‌ట్లుగా సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. శరద్ పవార్ సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన‌ట్లుగా ఆసుప‌త్రి వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ పేర్కొంది. ఆయ‌న ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంది. ఇటీవల ఆయ‌న వీల్‌చైర్‌లో పార్ల‌మెంట్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీకి వెళ్లిన ఆయ‌న‌.. మీడియాతో మాట్లాడారు. అంత‌కు ముందు ఫిబ్రవరిలో పవార్ రెండుసార్లు పుణెలోని ఆసుప‌త్రిలో చేరారు. ఛాతి ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్‌తో బాధ‌ప‌డిన‌ట్లుగా వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement