త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumitra Balmik | త‌ల్లిదండ్రుల‌ను చూసుకునేందుకు ఉద్యోగుల‌కు 45 రోజులు సెల‌వులు ఇవ్వాలి : ఎంపీ

Sumitra Balmik | 60 ఏళ్లు పైబ‌డిన త‌ల్లిదండ్రులను చూసుకునేందుకు (take care of their parents) ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు 45 రోజులు సెల‌వులు ఇవ్వాల‌ని (45 day leave for Employees) ఎంపీ సుమిత్రా వాల్మీకి (Sumitra Balmik) ప్ర‌తిపాదించారు.

D

National | Published On Feb 7, 2026, 1.34 pm IST

Sumitra Balmik | త‌ల్లిదండ్రుల‌ను చూసుకునేందుకు ఉద్యోగుల‌కు 45 రోజులు సెల‌వులు ఇవ్వాలి : ఎంపీ
Advertisement

Sumitra Balmik | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఎంపీ సుమిత్రా వాల్మీకి (Sumitra Balmik) రాజ్య‌స‌భ‌లో కీలక ప్ర‌తిపాద‌న చేశారు. 60 ఏళ్లు పైబ‌డిన త‌ల్లిదండ్రులను చూసుకునేందుకు (take care of their parents) ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు 45 రోజులు సెల‌వులు ఇవ్వాల‌ని (45 day leave for Employees) ప్ర‌తిపాదించారు. రాజ్య‌స‌భ‌లో జీరో అవ‌ర్‌లో (Zero Hour in the Rajya Sabha) మాట్లాడిన ఎంపీ ఈ సంద‌ర్భంగా ఈ ప్ర‌తిపాద‌న చేశారు.

"మహిళలు, యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోంది. అయితే ఇప్పుడు నేను మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్ర‌స్తుతం దేశంలో సీనియ‌ర్ సిటిజ‌న్ల సంఖ్య 14 కోట్లు దాటింది. 2036 నాటికి ఆ సంఖ్య 23 కోట్లు దాటుతుంది. అంటే ప్ర‌తి ముగ్గురు భార‌తీయుల్లో ఓ వృద్ధుడు ఉంటారు. అయితే, ఉపాధి అవ‌కాశాల కోసం కోట్లాది మంది యువ‌కులు త‌మ ఇళ్ల‌ను వ‌దిలి దూరంగా వెళ్లాల్సి వ‌స్తోంది. దీనివ‌ల్ల త‌ల్లిదండ్రులు ఒంట‌రివార‌వుతున్నారు.

వారికి వైద్య సంర‌క్ష‌ణ అవ‌స‌ర‌మైన‌ప్పుడు పిల్ల‌లు ద‌గ్గ‌ర ఉండ‌టం చాలా ముఖ్యం. కానీ ప‌ని ఒత్తిడితో యువ‌త త‌మ త‌ల్లిదండ్రుల‌ను చూసుకోలేక‌పోతున్నారు. ఆఫీసు నుంచి సెల‌వు తీసుకోవ‌డం వారికి ఇబ్బందిగా మారుతోంది. అందుకే 60 ఏళ్లు పైబ‌డిన త‌ల్లిదండ్రుల‌ను చూసుకునేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో ప‌నిచేసే వారికి 45 రోజులు సెల‌వు ఇవ్వాల‌ని నేను ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాను. ఓ త‌ల్లి త‌న బిడ్డ కోసం 20 ఏళ్ల స‌మ‌యం ఎలా కేటియిస్తోంది.. అదేవిధంగా వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌ల్లిదండ్రుల‌ను చూసుకునేందుకు కూడా పిల్ల‌లు స‌మ‌యం కేటాయించాలి" అని ఆమె ప్ర‌భుత్వానికి విన్న‌వించారు.

Advertisement
Advertisement