త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha | రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ ప్ర‌మాణం

Rajya Sabha | తెలంగాణ రాష్ట్ర నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ రాజ్య‌స‌భ స‌భ్యులుగా గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరిద్ద‌రి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు.

S

Telangana | Published On Apr 16, 2026, 2.17 pm IST

Rajya Sabha | రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ ప్ర‌మాణం
Advertisement

Rajya Sabha | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీ రాజ్య‌స‌భ స‌భ్యులుగా గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. వీరిద్ద‌రి ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వేం న‌రేంద‌ర్ రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కావ‌డంతో అవి అధికార కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని వరుసగా రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపింది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో వీరిద్దరూ ఏక‌గ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement