Pulwama Attack | పుల్వామా దాడికి ఏడేళ్లు.. వీర జవాన్లకు నేతల నివాళులు
Pulwama Attack | జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి (Pulwama Attack)కి నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తైంది.
Pulwama Attack | జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి (Pulwama Attack)కి నేటితో సరిగ్గా ఏడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా అమరవీరులకు (tribute to fallen soldiers) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
వీర సైనికుల త్యాగాన్ని మర్చిపోం..
2019లో పుల్వామా దాడిలో దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాన్ని భారత్ ఎన్నటికీ మరిచిపోదు. వీరుల ధైర్యం, దేశభక్తి.. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తినిస్తోంది. వారి సేవ, సంకల్పం, దేశభక్తి ఎప్పటికీ మనందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి అని ప్రధాని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
https://x.com/narendramodi/status/2022506173191327876
అంతకుముందు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కూడా అమరజవాన్లకు నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన ధీరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. బలమైన, సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడానికి వారి త్యాగం మనకు నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు.
పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం నివాళులర్పించారు. భారత్కు ఉగ్రవాదం కలిగిస్తోన్న తీవ్రమైన ముప్పును వారి త్యాగం ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. మాతృభూమి సార్వభౌమత్వం, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాలను చూసి భారత్ ఎప్పుడూ గర్వపడుతోందన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
https://x.com/VPIndia/status/2022484334268289187
పుల్వామా దాడి..
2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న కాన్వాయిని తీవ్రవాదులు పేల్చేశారు. ఈ పేలుడులో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఉగ్రదాడి జరగడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఇది జరిగిన సరిగ్గా 12 రోజులకు.. అంటే 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్-2000 విమానం రాత్రి వేళ నియంత్రణ రేఖ (ఎల్ఓసి)ను దాటి పాకిస్థాన్ వైపున ఉన్న బాలాకోట్లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ (Balakot Air Strike) చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Pulwama Attack Mastermind Killed | పీవోకేలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో పుల్వామా దాడుల మాస్టర్మైండ్ ‘హంజా బుర్హాన్’ హతం
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



