త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Independence Day | ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు.. ఎర్ర‌కోట‌పై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్ర‌ధాని మోదీ

Independence Day | దేశ‌వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు (Independence Day) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్ర‌క‌ ఎర్రకోటలో ప్రధాన మంత్రి మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగుర‌వేశారు.

G

National | Published On Aug 15, 2026, 8.00 am IST

Independence Day | ఘ‌నంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు.. ఎర్ర‌కోట‌పై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్ర‌ధాని మోదీ
Advertisement

Independence Day | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక‌లు (Independence Day) ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్ర‌క‌ ఎర్రకోటలో ప్రధాన మంత్రి మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగుర‌వేశారు. అనంత‌రం జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా వందేమాతర (Vande Mataram) గీతాన్ని పూర్తిగా ఆలపించారు. జాతీయ గీతం వందేమాతరం 150 ఏండ్ల‌ ఘనమైన వార‌స‌త్వాన్ని గుర్తుచేస్తూ ఎర్ర‌కోట వేదిక‌గా సముచితంగా గౌరవించారు. అంతకుముందు రాజ్​ఘాట్‌లో మ‌హాత్మా గాంధీ స‌మాధికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. కాగా, ఎర్ర‌కోట‌పై ప్ర‌ధాని మోదీ జాతీయ జెండాను ఎగుర‌వేయ‌డం ఇది 13వ సారి.

క‌లసిక‌ట్టుగా కృషి చేద్దాం..

భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టడానికి ప్రాణాలర్పించిన మహానీయుల ధైర్యం, త్యాగాలు, అంకితభావాన్ని స్మరించుకున్నారు. వారి కలలను సాకారం చేస్తూ, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎక్స్ వేదిక‌గా పిలుపునిచ్చారు.

 

Advertisement
Advertisement