PM Modi in Tamilnadu | డీఎంకే కౌంట్డౌన్ స్టార్ట్.. తమిళనాడు బీజేపీదే..!
ఈ సభకు వచ్చిన జన సందోహమే డీఎంకే ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇచ్చిందని, తమిళనాడు మార్పు కోసం ఎదురు చూస్తోందనడానికి మీరే సాక్షి అంటూ సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
PM Modi in Tamilnadu | కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సాగిన తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒకే అస్త్రంతో విరుచుకుపడ్డారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలకు కౌంట్ డౌన్ ప్రారంభమయిందని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే(DMK) పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారి అభివృద్ధిని మరిచిపోయిందని విమర్శించారు. తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, మార్పు తథ్యం అని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్ ఎన్డీఏకి ఇవ్వాలంటూ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు బీజేపీ ప్రభుత్వాన్నే కోరుకుంటోంది
కేరళ పర్యటన అనంతరం తమిళనాడు చేరుకున్న ప్రధాని మోదీ మధురాంతకంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఈసందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డీఎంకే.. సీఎంసీ ప్రభుత్వంగా మారుతోందని.. సీఎంసీ అంటే కరప్షన్, మాఫియా, క్రైమ్ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని భూస్థాపితం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
జన సందోహమే సాక్షి
ఈ సభకు వచ్చిన జన సందోహమే డీఎంకే ప్రభుత్వానికి గట్టి మెసేజ్ ఇచ్చిందని, తమిళనాడు మార్పు కోసం ఎదురు చూస్తోందనడానికి మీరే సాక్షి అంటూ సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన డీఎంకే
రెండు సార్లు డీఎంకేను తమిళనాడు ప్రజలు నమ్మారు. కానీ.. తమిళనాడు ప్రజల నమ్మకాన్ని డీఎంకే ప్రభుత్వం మోసం చేసింది. వాగ్దానాలన్నీ ఏమయ్యాయి. ఒక్క పని కూడా చేయలేదు. డీఏంకే సంకెళ్ల నుంచి తమిళనాడుకు విముక్తి కల్పిస్తాం. త్వరలోనే తమిళనాడు కూడా అభివృద్ధి చెందుతుందని మోదీ భరోసా ఇచ్చారు.
https://x.com/narendramodi/status/2014653630423695673
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



