త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Passenger Train | మంట‌ల్లో మ‌రో రైలు.. షార్ట్ స‌ర్క్యూట్‌తో పాట్నా ప్యాసింజ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం..

Passenger Train | మ‌రో రైలు మంట‌ల్లో (Passenger Train) కాలి బూడిదైంది. తిరువ‌నంత‌పురం-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్ర‌మాదం జ‌రిగి 24 గంట‌లు గ‌డువ‌క‌ముందే పాట్నా వెళ్తున్న ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలు అగ్నికి ఆహుతైంది.

G

National | Published On May 18, 2026, 9.08 am IST

Passenger Train | మంట‌ల్లో మ‌రో రైలు.. షార్ట్ స‌ర్క్యూట్‌తో పాట్నా ప్యాసింజ‌ర్‌లో అగ్నిప్ర‌మాదం..
Advertisement

Passenger Train | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌రో రైలు మంట‌ల్లో (Passenger Train) కాలి బూడిదైంది. తిరువ‌నంత‌పురం-ఢిల్లీ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్రిప్ర‌మాదం జ‌రిగి 24 గంట‌లు గ‌డువ‌క‌ముందే పాట్నా వెళ్తున్న ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలు అగ్నికి ఆహుతైంది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని స‌సారామ్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది.

స‌సారామ్‌-పాట్నా ఫాస్ట్ ప్యాసింజ‌ర్ రైలు స‌సారామ్ రైల్వే స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేరేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా ఓ బోగీలో మంట‌లు అంటుకున్నాయి. క్ర‌మంగా అవి విస్త‌రించ‌డంతో బోగీ పూర్తిగా కాలిపోయింది. అయితే రైలు ఆగి ఉండ‌టంతో పెనుప్ర‌మాదం త‌ప్పింది. ప్ర‌యాణికులంతా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. రైల్వే సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ప్ర‌మాదానికి కార‌ణం షార్ట్ స‌ర్క్యూట్ (Short Circuit) అని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

కాగా, ఆదివారం తెల్ల‌వారుజామున ఢిల్లీకి వెళ్తున్న తిరువ‌నంత‌పురం-హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో బీ-1 బోగీలో మంట‌లు చెల‌రేగాయి. దీంతో కోచ్ పూర్తిగా ద‌గ్ద‌మ‌య్యింది. ఈ ప్ర‌మాదంలో కూడా ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. షార్ట్ ష‌ర్క్యూట్ వ‌ల్లే మంట‌లు చెల‌రేగాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Advertisement
Advertisement