త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Poonch | మ‌ళ్లీ పాక్ క‌వ్వింపులు.. ఎల్‌వోసీని దాటిన డ్రోన్‌

Poonch | జమ్ము కశ్మీర్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. పూంచ్‌ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌లో ఆదివారం పాకిస్తాన్‌కు చెందిన అనుమానాస్పద డ్రోన్లు భారత గగనతలంలోకి చొర‌బ‌డ్డాయి. ఫార్వర్డ్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ల అసాధారణ కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.

P

National | Published On Mar 1, 2026, 4.40 pm IST

Poonch | మ‌ళ్లీ పాక్ క‌వ్వింపులు.. ఎల్‌వోసీని దాటిన డ్రోన్‌
Advertisement

Poonch | జమ్ము కశ్మీర్‌లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట మరోసారి దాయాది దేశం పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. పూంచ్‌ జిల్లాలోని దిగ్వార్‌ సెక్టార్‌లో ఆదివారం పాకిస్తాన్‌కు చెందిన అనుమానాస్పద డ్రోన్లు భారత గగనతలంలోకి చొర‌బ‌డ్డాయి. ఫార్వర్డ్‌ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆకాశంలో డ్రోన్ల అసాధారణ కదలికలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. పరిశీలనలో అవి పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్లుగా నిర్ధారణ కావడంతో భద్రతా దళాలు గాల్లోకి పన్నెండు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాయి. కాల్పుల ధాటికి డ్రోన్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వారు స్పష్టం చేశారు. ఇదే ప్రాంతంలో గత మూడు రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఫిబ్రవరి 27న కూడా పూంచ్‌ సెక్టార్‌లో సరిహద్దు రేఖ సమీపంలో ఒక డ్రోన్‌ కనిపించగా, భారత సైన్యం కాల్పులు జరిపి దాన్ని తరిమికొట్టింది. వరుసగా డ్రోన్‌ చొరబాట్లు చోటుచేసుకుంటుండటంతో సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. డ్రోన్ల ద్వారా భారత భూభాగంలోకి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేదా మాదకద్రవ్యాలను చేరవేసే ప్రయత్నం ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజా ఘటనలో డ్రోన్ల ద్వారా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు జారవిడిచారా అన్న దానిపై బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరాన్–ఇజ్రాయెల్‌, పాక్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా.. ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత స‌రిహ‌ద్దుల్లో కొంత‌కాలంగా ఉద్రిక‌త్త‌లు త‌గ్గాయి. అయితే, ప్ర‌స్తుతం మ‌ళ్లీ పాకిస్తాన్ క‌వ్వింపుల‌కు పాల్ప‌డుతోంది.

Advertisement
Advertisement