త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Row | నంద‌న్ నీలేక‌ని క‌మిటీలో ఉన్న‌ది ఎవ‌రు? టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుంది?

NEET Row | నీట్ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణను మరింత భద్రంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఈ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు.

P

National | Published On Jul 27, 2026, 4.21 pm IST

NEET Row | నంద‌న్ నీలేక‌ని క‌మిటీలో ఉన్న‌ది ఎవ‌రు? టాస్క్‌ఫోర్స్ ఏం చేస్తుంది?
Advertisement

NEET Row | నీట్ ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణను మరింత భద్రంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఈ కమిటీకి అధ్యక్షత వహించనున్నారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించి ప్రశ్నపత్రాల లీక్‌లకు అడ్డుకట్ట వేయడం, పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వాసం పెంపొందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా పనిచేయనుంది.

టాస్క్‌ఫోర్స్‌లో ఆరుగురు నిపుణులు

నందన్ నిలేకని నేతృత్వంలోని ఈ కమిటీలో సాంకేతికత, స్పేస్‌, నిఘా, విద్య, పరిపాలన రంగాలకు చెందిన ఆరుగురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.
నందన్ నిలేకని : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ మాజీ చైర్మన్
డాక్టర్ ఎస్ సోమ్‌నాథ్ : ఇస్రో మాజీ చైర్మన్
తపన్ దేకా : ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ డైరెక్టర్
ప్రొఫెసర్ వీ కామకోటి : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
అనితా కర్వాల్ : కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి
అమృత్ లాల్ మీనా : లాజిస్టిక్స్, ప్రజాపరిపాలన నిపుణులు

ఎవరీ నందన్ నిలేకని?

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను 1981లో ఎన్ఆర్ నారాయణమూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, ఎస్‌డీ శిబులాల్, కే దినేష్, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరాలతో కలిసి నందన్ నిలేకని స్థాపించారు. ప్రస్తుతం సంస్థకు నాన్‌-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)గా పనిచేసిన ఆయన.. అంతకుముందు మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించారు. 2017లో తిరిగి ఇన్ఫోసిస్‌లో చేరి నాన్‌-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో ఇన్ఫోసిస్‌కు రాజీనామా చేసిన నిలేకనిని అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆహ్వానంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలి చైర్మన్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆధార్ ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, బీజేపీ నేత అనంత్‌కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు.

కమిటీ బాధ్యతలివే

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను వెంటనే బలోపేతం చేసే చర్యలపై ఈ టాస్క్‌ఫోర్స్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ వ్యవస్థను సమూలంగా సంస్కరించడం, ప్రశ్నపత్రాల లీక్‌లను పూర్తిగా అరికట్టే విధానాలను రూపొందించడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అలాగే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గ‌రిష్టంగా వినియోగించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించడంపై కమిటీ దృష్టి సారించనుంది. కమిటీ సిఫార్సుల ఆధారంగా పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు అమలు చేసి, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

Advertisement
Advertisement