త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | మార్చి 31కల్లా దేశంలో నక్సలిజం అంతం : అమిత్ షా

Amit Shah | దేశంలో 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని (Naxalism) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Feb 21, 2026, 3.57 pm IST

Amit Shah | మార్చి 31కల్లా దేశంలో నక్సలిజం అంతం : అమిత్ షా
Advertisement

Amit Shah | దేశంలో 2026 మార్చి 31లోపు నక్సలిజాన్ని (Naxalism) పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి (Home Minister) అమిత్ షా (Amit Shah) మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అస్సాంలోని గౌహ‌తిలో శ‌నివారం నిర్వ‌హించిన 87వ సీఆర్పీఎఫ్ (Central Reserve Police Force) డే ప‌రేడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. జ‌మ్ము క‌శ్మీర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ ద‌ళం ముఖ్య పాత్ర పోషించింద‌న్నారు. ఇక్క‌డ రాళ్ల దాడి ఘ‌ట‌న‌లు సంఖ్య సున్నాకి ప‌డిపోయింద‌న్నారు. మ‌ణిపూర్‌లోనూ వ‌ర్గ హింస‌ను ఆ ద‌ళాలు క‌ట్ట‌డి చేసిన‌ట్లు చెప్పారు. కేవ‌లం మూడేళ్ల‌లో మావోల వెన్ను విర‌గొట్టిన‌ట్లు తెలిపారు. "నేను సీఆర్పీఎఫ్‌పై న‌మ్మ‌కంతో చెబుతున్నాను. 2026 మార్చి 31 నాటికి దేశంలో న‌క్స‌ల్ స‌మ‌స్య‌ను పూర్తిగా నిర్మూలిస్తాం" అని షా అన్నారు.

"2025 ఏప్రిల్-మే నెలల్లో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ బ్లాక్ ఫారెస్ట్‌లో 31 మంది మావోయిస్టులు మరణించారు. 46 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా.. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ ఫోర్స్ ద‌ళాలు ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌ద‌ర్శించారు. మండే రాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మావోల ప‌ట్టు నుంచి ఆ ప‌ర్వ‌తాల‌కు విముక్త‌లి క‌ల్పించారు. 11 ఏళ్ల క్రితం దేశంలో మూడు పెద్ద హాట్‌స్పాట్‌లు ఉండేవి. జ‌మ్ము క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదం, ఈశాన్యంలో చొర‌బాటులు, ఛత్తీస్‌గఢ్ అడ‌వుల్లో న‌క్స‌లిజం పెద్ద స‌మ‌స్య‌గా ఉండేవి. ఇప్పుడు అవి శాంతి, ప్ర‌గ‌తికి కేంద్రాలుగా మారాయి. ఒక‌ప్పుడు బాంబు దాడులు, బుల్లెట్‌లు, దిగ్బంధ‌నాలు, విధ్వంసాల‌కు కేంద్రంగా ఉన్న ఈ మూడు ప్రాంతాలు నేడు దేశ అభివృద్ధిలో భాగ‌మ‌య్యాయి. సీఆర్పీఎఫ్ స‌హ‌కారం లేనిదే ఇది సాధ్యం కాదు" అని అమిత్ షా వెల్ల‌డించారు. అదేస‌మ‌యంలో ఈశాన్యంలో 700 మంది, న‌క్స‌ల్ ప్రాంతంలో 780 మంది, జ‌మ్ము ప్రాంతంలో 540 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మ‌ర‌ణించిన‌ట్లు గుర్తు చేశారు. వీరి త్యాగాల వ‌ల్లే ఆ ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంటున్నాయని షా పేర్కొన్నారు.

Advertisement
Advertisement