త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AIMIM Party | ముంబై మున్సిపల్ పోరు.. రెండు వార్డుల్లో ఎంఐఎం పార్టీ విజయం

వార్డు నెం 134లో మెహజబీన్ అతీక్ అహ్మద్ ఖాన్ విజయం సాధించగా, వార్డు నెంబర్ 145లో ఖైరున్సీసా అక్బర్ హుస్సేన్ గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది.

J

National | Published On Jan 16, 2026, 3.11 pm IST

AIMIM Party | ముంబై మున్సిపల్ పోరు.. రెండు వార్డుల్లో ఎంఐఎం పార్టీ విజయం
Advertisement

AIMIM Party | ముంబై మున్సిపల్ పోరులో మహాయుతి కూటమి మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ రెండో స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన ఎంఐఎం పార్టీ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో 4 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికారిక ఫలితాల ప్రకారం ఎంఐఎం అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు.

వార్డు నెం 134లో మెహజబీన్ అతీక్ అహ్మద్ ఖాన్ విజయం సాధించగా, వార్డు నెంబర్ 145లో ఖైరున్సీసా అక్బర్ హుస్సేన్ గెలుపొందారు. మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంది.

బీజేపీ, ఏక్‌నాథ్ షిండే కూటమి మహాయుతి 117 సీట్ల ముందంజలో ఉంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని అధిరోహించాలంటే 114 వార్డుల్లో గెలుపొందాలి. ఇప్పటికే బీజేపీ 86 స్థానాల్లో ముందంజలో ఉండగా, షిండే శివసేన పార్టీ 31 స్థానాల్లో ముందంజలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎంఎన్ఎస్ కూటమి 63 స్థానాల్లో లీడ్‌లో ఉండగా కాంగ్రెస్ 13 స్థానాల్లో లీడ్‌లో ఉంది. జనవరి 15న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగింది. 52.94 శాతంగా ఈసారి నమోదు అయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement