త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maoist Party | లొంగిపోయిన మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి?

Maoist Party | మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై మ‌రికొద్ది సేప‌ట్లో కేంద్ర‌ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

A

National | Published On Mar 4, 2026, 8.50 pm IST

Maoist Party | లొంగిపోయిన మావోయిస్టు అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి?
Advertisement

Maoist Party | త్రినేత్ర‌.న్యూస్‌: మావోయిస్టు పార్టీ అగ్ర‌నేత గ‌ణ‌ప‌తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై మ‌రికొద్ది సేప‌ట్లో కేంద్ర‌ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే  హోం శాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ముఖ్యమంత్రి తో పాటు డిజిపి శివధర్ రెడ్డి, ఎస్సైబీ చీఫ్ సుమ‌తి, అడిష‌న‌ల్ డీజీ విన‌య్‌కుమార్‌ ఉన్నారు. మావోయిస్టుల అంతానికి కేంద్ర‌ప్ర‌భుత్వం విధించిన డెడ్‌లైన్ ఈ నెలాఖ‌రున ముగియ‌నున్న నేప‌థ్యంలో గ‌ణ‌ప‌తి లొంగుబాటు కీల‌కంగా మారింది. అప్ప‌టి పీపుల్స్ వార్‌లో చేరిన గ‌ణ‌ప‌తి దాదాపు నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా అజ్ఞాతంలోనే కొన‌సాగారు. సాయుధ పార్టీల విలీనం అనంత‌రం సుదీర్ఘ‌కాలం మావోయిస్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement