త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Loco Pilot | క‌దులుతున్న రైలు ఇంజిన్‌పై దాడి.. లోక్‌పైలెట్‌కు తీవ్ర గాయాలు.. వీడియో

Loco Pilot | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సింగరాయ‌కొండ వ‌ద్ద క‌దిలే రైలుపై దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు. దీంతో లోక్‌పైలెట్ (Loco Pilot) తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

G

National | Published On Jun 5, 2026, 11.46 am IST

Loco Pilot | క‌దులుతున్న రైలు ఇంజిన్‌పై దాడి.. లోక్‌పైలెట్‌కు తీవ్ర గాయాలు.. వీడియో
Advertisement

Loco Pilot | త్రినేత్ర‌.న్యూస్‌: ఇటీవ‌లి కాలంలో రైళ్ల‌పై దాడులు (Attack on Train) స‌ర్వ‌సాధ‌ర‌ణ‌మై పోయాయి. వందే భార‌త్ రైళ్ల‌పై రాళ్ల దాడులు చేయ‌డం, రైలు ప‌ట్టాల‌కు ఉండే పిన్‌లు తీసేడం వంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని సింగరాయ‌కొండ వ‌ద్ద క‌దిలే రైలుపై దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు. దీంతో లోక్‌పైలెట్ (Loco Pilot) తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలు (నంబ‌ర్ 12616) శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సింగరాయకొండకు చేరుకుంది. ఈ క్ర‌మంలో గుర్తు తెలియని వ్యక్తులు రాయితో ఇంజిను ముందు అద్దంపై బలంగా కొట్టారు. దీంతో అది నేరుగా డ్రైవర్‌కు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. గాయ‌ప‌డిన లోక్‌పైలైట్‌ను విజ‌య‌వాడ‌కు చెందిన‌ జ‌య‌రామ్‌గా గుర్తించారు. అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌కు చేరుకోగానే రైల్వే ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌డు క్షేమంగానే ఉన్నాడ‌ని, ప్రాణాపాయం లేద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన ఆర్పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement