త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

రోడ్డుపై 250 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లిన లగ్జరీ కారు.. వాహనదారులు షాక్

ఆ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆ కారు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు కారును సీజ్ చేశారు. అహ్మదాబాద్‌కి చెందిన నిరవ్ పటేల్ ఆ కారు ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది ముంబైలోని ఖార్ వెస్ట్‌కి చెందిన ఫైజ్ అదన్ వాలాగా పోలీసులు గుర్తించారు.

J

National | Published On Dec 17, 2025, 4.42 pm IST

రోడ్డుపై 250 కిమీ స్పీడ్‌తో దూసుకెళ్లిన లగ్జరీ కారు.. వాహనదారులు షాక్
Advertisement

సాధారణంగా రోడ్డు మీద ఏ వాహనం అయినా వంద స్పీడ్ దాటితే గ్రేట్. అది కూడా హైవేల్లోనే సాధ్యం అవుతుంది. ట్రాఫిక్‌లో, చిన్న రోడ్ల మీద, జనాలు ఉన్న ప్రాంతాల్లో అది సాధ్యం కాదు. కానీ.. ఓ లగ్జరీ కారు మాత్రం ఏకంగా రోడ్డుపై 250 కేఎంపీహెచ్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. దీంతో ఆ రూట్‌లో వెళ్తున్న ఇతర వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును సీజ్ చేశారు.

ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలో ఉన్న బాంద్రా - వర్లీ సీ లింక్ రోడ్‌లోకి ఈ కారు ఒక్కసారిగా స్పీడ్‌గా దూసుకొచ్చింది. అది లంబోర్గిని కంపెనీకి చెందిన ఉరుస్ కారు. దాని ధర కొన్ని కోట్లు ఉంటుంది. ఆ కారు లింక్ రోడ్‌లో 250 కిమీల స్పీడ్‌తో దూసుకెళ్లడంతో అక్కడి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ కారు హర్యానా రిజిస్ట్రేషన్‌తో ఉండగా, ఆ కారు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినందుకు కారును సీజ్ చేశారు.

Lamborghini car driven at 250 kmph on Mumbai sea link road

అహ్మదాబాద్‌కి చెందిన నిరవ్ పటేల్ ఆ కారు ఓనర్‌గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆ కారును నడిపింది ముంబైలోని ఖార్ వెస్ట్‌కి చెందిన ఫైజ్ అదన్ వాలాగా పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యం, డేంజరస్ డ్రైవింగ్‌కి సంబంధించి డ్రైవర్‌పై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement