JEE Results | జేఈఈ ఫలితాలు విడుదల చేసిన ఎన్టీఏ.. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి 100 పర్సంలైట్..!
JEE Results | జేఈఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. ఫైనల్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఫలితాలను వెల్లడించింది. వాస్తవానికి జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 12 వరకు విడుదల చేయాల్సి ఉండగా.. ఈ నెల 16లోగా విడుదల చేస్తామంటూ వాయిదా వేసింది.
JEE Results | జేఈఈ మెయిన్ ఫలితాలను ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. ఫైనల్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఫలితాలను వెల్లడించింది. వాస్తవానికి జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 12 వరకు విడుదల చేయాల్సి ఉండగా.. ఈ నెల 16లోగా విడుదల చేస్తామంటూ వాయిదా వేసింది. అభ్యర్థులు ఫలితాలను jeemain.nta.nic.in, ఎన్టీఏ వెబ్సైట్ nta.ac.inలలో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేసి స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత (పేపర్-1, పేపర్-2) పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్-1 (బీఈ-బీటెక్) కోసం దేశవ్యాప్తంగా 13.55లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో దాదాపు 95శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 4న ఎన్టీఏ ప్రొవిజినల్ కీని విడుదల చేసింది. 6వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించింది. తాజాగా సోమవారం ఉదయం ఫైనల్ కీని విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఫలితాలను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఈ సారి 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక్కరు వంద పర్సంటైల్ సాధించారు. రాజస్థాన్ నుంచి ముగ్గురు, ఢిల్లీ, బిహార్, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఒక్కరు 100 పర్సంటైల్ సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. ఓబీసీ కేటగిరిలో ఏపీకి చెందిన జీ నరేంద్ర బాబు, ఎస్సీ కేటగిరిలో పసల మోహిత్ (ఏపీ) మొదటి ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన వివన్ శరత్ మహీశ్వరి వంద పర్సంలైట్ సాధించారు. ఈ సారి మొత్తం 13,04,653 మంది పరీక్ష రాయగా.. మెయిన్ ఫలితాలతో పాటు ఆలిండియా ర్యాంక్ లిస్ట్, రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ విడుదల చేసింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



