త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | బంగ్లాదేశ్‌కు మా మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉంటుంది.. తారిక్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ

PM Modi | బంగ్లాదేశ్ పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో బంగ్లాదేశ్ నేష‌న‌లిస్ట్ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు.

D

National | Published On Feb 13, 2026, 11.44 am IST

PM Modi | బంగ్లాదేశ్‌కు మా మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉంటుంది.. తారిక్‌కు కంగ్రాట్స్ చెప్పిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | బంగ్లాదేశ్ పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల్లో బంగ్లాదేశ్ నేష‌న‌లిస్ట్ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు. బీఎన్‌పీ అధినేత తారిక్ రెహ‌మాన్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తారిక్ గెలుపు దేశ ప్ర‌జ‌ల్లో ఆయ‌న ప‌ట్ల ఉన్న విశ్వాసాన్ని చూపుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్య‌, ప్ర‌గ‌తిశీల దిశ‌గా వెళ్తున్న బంగ్లాదేశ్‌కు త‌మ మ‌ద్ద‌తు ఎప్ప‌టికీ ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ఆ దేశంతో బంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు.

20 ఏళ్లుగా అధికారం కోసం ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింది. నిన్న జ‌రిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ (Tarique Rahman) నేతృత్వంలోని బీఎన్‌పీ భారీ మెజారిటీతో గెలుపొందింది. మొత్తం 299 స్థానాల‌కు జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి బీఎన్‌పీ (BNP) 212 స్థానాల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఈ గెలుపుతో రెహ‌మాన్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు బీఎన్‌పీ ప్ర‌క‌టించింది. ఇక ఈ ఎన్నిక‌ల్లో జ‌మాతే ఏ ఇస్లామీ నేతృత్వంలోని కూట‌మి 70 స్థానాల్లో విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతోంది. అయితే, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్‌ను బీఎన్‌పీ దాటేసింది. ఆ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ఢాకా-17, బోగ్రా-6 స్థానాల నుంచి ఘన విజయం సాధించారు.

Advertisement
Advertisement