త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Age Based Restrictions for Social Media | పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఆస్ట్రేలియా తరహాలో భారత్ కీలక నిర్ణయం

పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వాడకంపై వయో పరిమితి విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆస్ట్రేలియా తరహాలో కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.

J

National | Published On Feb 17, 2026, 6.33 pm IST

Age Based Restrictions for Social Media | పిల్లలకు సోషల్ మీడియా బంద్? ఆస్ట్రేలియా తరహాలో భారత్ కీలక నిర్ణయం
Advertisement
  • సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు ఆంక్షలు?

Age Based Restrictions for Social Media | త్రినేత్ర.న్యూస్ : స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు గంటల తరబడి సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. అయితే, ఇకపై చిన్నారులు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆస్ట్రేలియా తరహాలో భారత్‌లోనూ వయో పరిమితి నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏమన్నారంటే?

న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వయో పరిమితి విధించడం "సరైన మార్గం" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వల్ల పిల్లలపై పడుతున్న దుష్ప్రభావాల గురించి ఆందోళన ఉందని, దీనిని అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా బాటలో భారత్?

ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే చట్టాన్ని ఆమోదించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. భారత్‌లోనూ ఇలాంటి నిబంధనలు తేవడంపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోందని తెలిపారు.

సోషల్ మీడియా సంస్థలతో చర్చలు

సోషల్ మీడియా సంస్థలతో (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్) వయసు ధృవీకరణ, ఆంక్షల అమలు, డీప్‌ఫేక్‌పై కేంద్రం ఇప్పటికే చర్చలు జరుపుతోంది. ప్రస్తుతమున్న చట్టాల్లో మార్పులు చేయడం ద్వారా లేదా కొత్త నిబంధనలు తేవడం ద్వారా పిల్లలను ఆన్‌లైన్ ముప్పుల నుంచి కాపాడాలని ప్రభుత్వం చూస్తోంది. ఏ వయసు వారు వాడుతున్నారో కచ్చితంగా గుర్తించడానికి ఎలాంటి సాంకేతికత వాడాలనే దానిపై కసరత్తు జరుగుతోంది.

పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా సోషల్ మీడియా వ్యసనాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement