త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | ఐసీయూలో చెల‌రేగిన అగ్నికీల‌లు.. న‌లుగురు రోగులు మృతి

Fire Accident | దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్‌లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క ముందే బీహార్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.

S

National | Published On Jun 4, 2026, 8.40 am IST

Fire Accident | ఐసీయూలో చెల‌రేగిన అగ్నికీల‌లు.. న‌లుగురు రోగులు మృతి
Advertisement

Fire Accident | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్‌లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క ముందే బీహార్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చెల‌రేగిన అగ్నికీల‌లు న‌లుగురు రోగుల ప్రాణాల‌ను బ‌లిగొన్నాయి.

ముజ‌ఫ‌ర్‌పూర్ జిల్లాలోని ప్ర‌సాద్ హాస్పిట‌ల్‌లో గురువారం తెల్ల‌వారుజామున 3.55 గంట‌ల స‌మ‌యంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఐసీయూలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో.. ఆస్ప‌త్రి సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు.

హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. దాదాపు 20 మంది రోగుల‌ను ఇత‌ర ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. మ‌రో న‌లుగురు రోగులు మంట‌ల్లో చిక్కుకుని స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్లే అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

నిన్న ఢిల్లీలోని మాల‌వీయ న‌గ‌ర్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో హోట‌ల్‌లో 40 మంది అతిథులు ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Advertisement
Advertisement